Sunday, August 24, 2014

ఆరాధన – పరమార్థం


ఇస్లాంలో ఆరాధన ఉద్దేశ్యం చాలా విస్తృతమైనది. నమాజ్, రోజా, జకాత్, హజ్‌లతోపాటు నిత్యజీవితంలో ఆచరించబడే ఆచరణలు కూడా ఆరాధనలో భాగమేనని ప్రకటించింది. మనిషి తన స్వప్రయోజనంకోసం, ఇతరుల మంచికోసం ఆచరణలు చేస్తాడు. ఈ ఆచరణలు చిత్తశుద్ధితో దైవప్రసన్నతకోసం, దైవ సామీప్యాన్ని పొందే సంకల్పంతో చేస్తే, అవి చిన్న ఆచరణలైనా కొండంత పుణ్యాన్ని కూడపెడతాయి. సామూహిక ప్రయోజనం చేకూర్చే ప్రతి ఆచరణను ఇస్లాం ఉత్తమ ఆదరణ అని పేర్కొంది.
కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, బాధితులకు సహకరించడం, యాచకునికి సహాయం చేయడం, నిరాశ్రయునికి ఆశ్రయం కల్పించడం, నిరక్షరాస్యునికి అక్షరబోధన చెయ్యడం, దారిలో ఉన్న ప్రమాదభరిత వస్తువును ఏరిపారవేయడం, సోదరునితోను, పొరుగువానితోను ఆప్యాయంగా పలకరించడం, కన్నవారిని అంటే తల్లిదండ్రులను ప్రేమగా చూడటం… మొదలైనవన్నీ ఆరాధనకు మారురూపాలే.
దైవమార్గంలో ఖర్చు చేసేందుకు నా వద్ద ఒక్క పైసా లేదని, నేను ఏవిధంగా పుణ్యకార్యాలు చేసేదని ప్రవక్త (స)ను అడగ్గా ఆయన (స) ‘‘నీవు మంచిని గురించి ఆజ్ఞాపించు, చెడును నివారించు లేదా అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించు లేదా బాధితునికి సహాయపడు లేదా మార్గమధ్యంలో పడివున్న హానికర వస్తువును దూరం చెయ్యి’’ అన్నారు. ఇంకా చెవిటివానికి వినిపించడం, అవిటివానికి సహకరించడం, గ్రుడ్డివానికి దారిచూపించడం, జంతువు దాహం తీర్చటం,ఆకలితో వున్నవానికి అన్నం పెట్టడం, మొక్కను నాటడం – అవన్నీ ఆరాధనలే.


    ఇస్లామీయ ఆరాధనల అసలు లక్ష్యం – ఆత్మసంస్కరణ, ఆత్మప్రక్షాళన. ఈ శిక్షణ, సంస్కరణల ద్వారా మనిషి దైవసామీప్యానికి చేరుకుంటాడు. ఉదాహరణకు ‘రోజా’ను తీసుకున్నట్లయితే – దైవాదేశమైన రోజాను పాటించి దైవవిధేయతను ఉపవాసి చాటుకున్నాడు. ఆ దైవాదేశమెలాంటిదైనా, ఎంతటి కష్టతరమైనదైనా విశ్వాసి దాన్ని పాటించి సంపూర్ణ దైవవిధేయతను చాటుకుంటాడు. ‘ఆరాధనల అసలు పరమార్థం – ఆత్మసంస్కరణ, ఆత్మప్రక్షాళన’

    జుమా నమాజ్‌


    జుమా నమాజ్‌ చేయటం విధి. దాని గురించి దేవుడు ఇలా ఆదేశిస్తున్నాడు: ”విశ్వసించిన ప్రజలారా! శుక్రవారం నాడు నమాజ్‌ కోసం పిలిచినప్పుడు, అల్లాహ్‌ా సంస్మరణ వైపు పరుగెత్తండి; క్రయవియ్రాలను వదలి పెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది”. (అల్‌ జుమా: 9)
    దైవవ్రక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”పుట్టుక రీత్యా మనం గత సమాజాల వారందరికంటే చివర్లో ఉన్నా, స్వర్గానికి ముందుగా మనమే వెళ్తాం.  శక్రవారం (నాడు చేసే ఆరాధన) అందరిపైనా విధిగా చేయబడింది. కాని యూదులు, క్రైస్తవులు దాంతో విభేదించారు. యూదులు తమ ఆరాధన కోసం (తామే స్వయంగా) శనివారాన్ని నిర్ణయించుకున్నారు. క్రైస్తవులు ఆదివారాన్ని ఎంచుకున్నారు. అయితే ముస్లింల కొరకు దేవుడు శుక్రవారం రోజును నిర్ణయించాడు”. (బుఖారీ, ముస్లిం)

    జుమా నమాజు నుంచి మినహాయించబడినవారు

    దైవవ్రక్త (స) ఇలా ప్రబోధించారు: ”జుమా నమాజును సామూహికంగా చేయడం ముస్లింలందిపై విధిగా చేయబడింది. అయితే బానిసలకు, స్త్రీలకు, పిల్లలకు, వ్యాధిగ్రస్తులకు, ప్రయాణికులకు ఇందులో మినహాయింపు ఉంది”. (అబూ దావూద్‌)

    జుమా ఘనత, ప్ర్రాముఖ్యత

    1) వారాలన్నింటికీ నాయకుడు లాంటిది శుక్రవారము (జుమా రోజు).
    2) దేవుడు హజ్రత్‌ ఆదం (తి)ను పుట్టించింది జుమా రోజునే.(ముస్లిం)
    3) ఆ రోజే దేవుడు ఆదం (అ)ను భూమి మీదకు దింపాడు. (ముస్లిం)
    4) ఈదుల్‌ ఫితర్‌ (రమజాన్‌), ఈదుల్‌ అజ్హా (త్యాగోత్సవం) దినాలకన్నా జుమా రోజు శ్రేష్ఠమైనది. (ముస్నదె అహ్మద్‌)
    5) జుమా రోజున ఒక ఘడియ వస్తుంది. ఆ సమయంలో దుఆ చేస్తే తప్పకుండా ఆమోదించబడుతుంది. దేవుని నుండి మంచిని ఆశించేవారికి అది తప్పకుండా లభిస్తుంది. బహుశా ఆ ఘడియ అస్ర్‌ నమాజ్‌ తర్వాత రావచ్చు. (అహ్మద్‌)
    6) దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”ఎవరైనా జుమా రోజు గుసుల్‌ చేసి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వెళ్ళి అక్కడ తను చేయగలిగినన్ని నమాజులు చేసి, ఆ తర్వాత ఉపన్యాసం ముగిసే వరకు నిశ్శబ్ధంగా ఉండి, శ్రద్ధగా ఉపన్యాసం విని ఇమామ్‌తోపాటు ఫర్జ్‌ నమాజ్‌ చేస్తే గత శుక్రవారం నుండి ఆ శుక్రవారం వరకు అతని వల్ల జరిగిన పాపాలన్నీ మన్నించబడతాయి. అంతే కాదు, అదనంగా మరో మూడ్రోజుల పాపాలు కూడా  క్షమించబడతాయి. (ముస్లిం)
    7)  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకెల్లా జుమా రోజు అత్యంత శ్రేష్ఠమైనది. ఆదం (అ) పుట్టింది ఆ రోజే. ఆ రోజే ఆయన స్వర్గంలోకి ప్రవేశించారు. తిరిగి అదే రోజు ఆయన స్వర్గం నుండి భూమి మీదకు వచ్చారు. ప్రళయం కూడా అదే రోజు వస్తుంది”. (ముస్లిం)
    8) హజ్రత్‌ అబూ హురైరా (ర) కథనం ప్రకారం  దైవప్రవక్త (స) ఈ విధంగా ప్రవచించారు: ”జుమా రోజు దైవదూతలు మస్జిద్‌ ద్వారం వద్ద నిలబడి జుమా నమాజు కొరకు మస్జిద్‌కు వచ్చేవారి పేర్లు వరుసగా నమోదు చేస్తూ ఉంటారు. మస్జిద్‌కు తొలి వేళప్పుడు వచ్చినవారికి ఒక ఒంటె ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. తరువాత వచ్చినవారికి పొట్టేలును ఖుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. చివర్లో వచ్చేవారికి కోడి, ఆ తర్వాత వచ్చేవారికి గ్రుడ్డు దానం  చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఇమామ్‌ ఖుత్బా ఇవ్వడానికి బయలుదేరగానే దైవదూతలు రిజిష్టర్‌ మూసేసి ఖుత్బా వినడానికి కూర్చుంటారు”. (బుఖారీ, ముస్లిం)

    దైవప్రవక్త (స) ఆగ్రహం

    దైవప్రవక్త (స) జుమా నమాజు చేయనివారిపై మండిపడుతూ, ”ప్రజలకు నమాజు చేయించడానికి నా స్థానంలో మరొకరిని నిలబెట్టి జుమా నమాజుకు రాని వారిని పట్టుకుని వారి ఇళ్ళ సమేతంగా వారిని దహనం చేయాలని అనిపిస్తోంది” అని అన్నారు. (ముస్లిం)

    వరుసగా జుమా నమాజులు ఎగవేసేవాడి పర్యవసానం

    ఆయన ఇంకా ఇలా అన్నారు: ”తగిన కారణం లేకుండా సోమరితనంతో వరుసగా మూడు జుమా (నమాజు)లు ఎగ్గొట్టినవారి హృదయాలను (సన్మార్గ భాగ్యం లభించకుండా) దేవుడు సీలు చేసేస్తాడు”. (అబూ దావూద్‌)
    వేరొక హదీసులో ఇలా ఉంది: ”ప్రజలు జుమా నమాజును వదిలేయటాన్ని మానుకోవాలి లేదా దేవుడు వారి హృదయాలకు ముద్రవేస్తాడు.  తత్ఫలితంగా వారు (శాశ్వతంగా) ఏమరుపాటుకు లోనయ్యే ప్రమాదముంది”. (ముస్లిం)

    దుఆ


    అశాశ్వతమైన ఈ లోకంలో దేవుడు కష్టం, సుఖం, అదృష్టం, దురదృష్టం, మిత్రులు శత్రువులు, ఆరోగ్యం, అనారోగ్యం లాంటి సుఖదుఃఖాలెన్నింవిరినో సృష్టించాడు. మనిషి తను పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తరచూ ఇలాంటి వాటికి గురవుతూనే ఉంటాడు. అయితే దేవుడు వాటితోపాటు వాటి నుండి రక్షణ పొందటానికి ఎన్నో పద్ధతులు, ముందు జాగ్రత్తలు కూడా సూచించాడు. వాటిని ఆచరించి మనిషి తన్ను తాను కష్టాల నుండి రక్షించుకోగలడు. మానవులు రోగాలను నయం చేసుకోవటానికి ప్రార్థనలను, మందులను కూడా దేవుడు పుట్టించాడు. అందుకే దైవప్రవక్త (స) ఒకానొక సందర్భంగా ”దేవుడు ప్రతి వ్యాధికీ చికిత్సను, ఔషధాలను పుట్టించాడు” అని అన్నారు. (బుఖారీ)

    దుఆలను అల్ల్లాహ్‌ మాత్రమే ఆలకిస్తాడు

    వాస్తవానికి మానవుల్ని దుఃఖవిచారాలకు, కష్టాలు కడగండ్లకు గురి చేసేవాడూ, తిరిగి వాటి నుండి కాపాడి వారికి సౌఖ్యాన్నీ, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కూడా దేవుడే! సృష్టిలోని ప్రతి వస్తువుపై ఆయనకు తిరుగులేని ఆధిపత్యం ఉంది.  అయితే ఈ కష్టాలు, కడగండ్లకు గురైనప్పుడు తనను మొరపెట్టుకునే వారిని ఆయన అమితంగా ప్రేమిస్తాడు. ఆ విధంగా మొరపెట్టుకోవటాన్నే ‘దుఆ’ అని అంటారు.
    ”బాధితుడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించి, అతని బాధను దూరం చేసేవాడు ఎవడు?” (ఖుర్‌ఆన్‌- 27: 62)
    పుట్టుక రీత్యా మనిషి అవసరాలు, అక్కరలు కలవాడు. సహజంగానే అతనికి అవసరాలు ఏర్పడుతుంటాయి. అల్లాహ్‌ా మాత్రమే సర్వ సంపన్నుడు, నిరపేక్షాపరుడు. ఆయన ఇలా అంటున్నాడు:
    ”మానవులారా! మీరందరూ అల్లాహ్‌ా అవసరం కలవారే. కాని అల్లాహ్‌ మాత్రం సర్వ సంపన్నుడు, స్వయంగానే స్తుతిపాత్రుడు”. (ఖుర్‌ఆన్‌ – 35: 15)

    అల్ల్లాహ్‌ను తప్ప ఇతరులను ప్రార్థించరాదు

    మనిషి సహజంగా అవసరాలు కలవాడు అవడం చేత దుఆ తప్ప అతనికి గత్యంతరం లేదు. దుఆ మనిషికి నిత్యావసరం. మానవులు సాటి మానవుల్ని మొరపెట్టుకోవటం ప్రకృతి విరుద్ధమైన పని. స్వయంగా నిస్సహాయుడైన మానవుడు సాటి మానవుల నిస్సహాయతను దూరం చేయలేడు. అల్లాహ్‌ాను వదలి పెట్టి ఇతర సజీవినిగాని, నిర్జీవినిగాని మొరపెట్టుకోవటం ఎంత తెలివి తక్కువ పనంటే అలా చేసేవాడు నీళ్ళ ముందు నిలబడి ”వచ్చెయ్యి! నా నోట్లోకి వచ్చెయ్యి” అని నీళ్ళను పిలిచే మూర్ఖుడితో సమానం. (13: 14).
    విశ్వ సామ్రాజ్యాధిపతి అయిన అల్లాహ్‌ాను త్రోసిరాజని సజీవ లేక నిర్జీవ సృష్టిరాసుల్ని మొరపెట్టుకునేవారు ఎంత అవివేకులు?! కొందరయితే కదలలేని, మెదలలేని, కనులు విప్పి చూడలేని, పెదవి విప్పి పలకలేని రాళ్ళను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని వాటిని తమ కష్టాల గురించి మొర పెట్టుకుంటుంటారు. ఈ వైఖరి మరీ దారుణం!
    సకల లోకాలకూ ప్రభువైన అల్లాహ్‌ా కొలువు తీర్చి, ”నన్ను మొరపెట్టుకోండి. నేను మీ మొరలను ఆలకిస్తాను” అని ప్రకటిస్తూ ఉంటే, మరోవైపు ఆయన దాసులు ఆయన్ని వదలిపెట్టి ఇతర మిథ్యా దైవాల ముందు చేయి చాపటం ఎంత దిగజారుడుతనం?! ఒక ముస్లిం అలాంటి ఘాతుకానికి ఒడిగడితే అది ఇంకా శోచనీయమైన విషయం!
    ‘దుఆ’ కూడా ఒక ఆరాధన లాంటిది. ఆరాధనలన్నీ అల్లాహ్‌ాకే చెల్లుతాయి. అల్లాహ్‌ాను వదలి ఇతరుల్ని మొరపెట్టుకోవటం, వారిని సహాయం చేయమని అర్థించటం, వారిని ఆపద మ్రొక్కువారిగా తలపోయటం ”షిర్కె జలీ” (బహిరంగ బహుదైవారాధన) అవుతుంది. దేవుడు దాన్ని ఎన్నటికీ మించడు.
    విశ్వాసి చేతిలో ‘దుఆ’ ఆయుధం వంటిది. దాని ముందు పెద్ద పెద్ద ఆయుధాలు కూడా పనికిరాకుండా పోతాయి. హృదయావేదనకు ఉపశమనం, బాధితులకు ఆధారం, భయాందోళనలకు గురయిన వారికి అభయ హస్తం దుఆ!

    బాధితుని శాపం సప్తాకాశాలనూ చీల్చుకుని వెళుతుంది

    బాధితుని నోటి నుండి వెలువడే దుఆ అంతరిక్షాన్ని, సప్తాకాశాలనూ చీల్చుకుంటూ దైవ సన్నిధికి వెళ్ళి బాధితునికి సహాయం అందేలా చేస్తుంది.

    దుఆ ఎన్నడూ త్రోసిపుచ్చబడదు!



      దాసుడు చేసే దుఆ ఎట్టి పరిస్థితిలోనూ త్రోసిపుచ్చబడదు. దాసుని దుఆ ఒక్కోసారి వెంటనే దైవ సన్నిధిలో స్వీకృతికి నోచుకుంటుంది. లేదా దాని మూలంగా అతనికి రాబోయే ఆపదలు, గండాలు తప్పి పోతాయి. లేదా ఆ దుఆ అతని పరలోక జీవితం కొరకు నిక్షేపంగా ఉంచబడుతుంది.

      తీర్చి దిద్దిన తీరు చూడు!


      మహా ప్రవక్త ముహమ్మద్‌ (స ) ప్రజల జీవితాలను తీర్చి దిద్దటానికి, ఆంతర్యాలను పరిశుద్ధ పరచటానికి పూనుకున్నప్పుడు రకరకాల జనులు ఆయన (స ) ముందున్నారు. ధనికులతోపాటు పేదవారు కూడా ఉన్నారు. పండితులతో పాటు పామరులు కూడా ఉన్నారు. నాగరికులతో పాటు అనాగరికులు కూడా ఉన్నారు. మానవ మహోపకారి అయిన ప్రవక్త (స ) అందరినీ శ్రద్ధగా గమనిస్తూ ఉండేవారు. వారి పరిస్థితిని బట్టి విషయం అర్థమయ్యేలా చెప్పేవారు.

      ఒక న్యూ ముస్లిం

      ముఆవియా బిన్‌ హకమ్‌ సులమీ ప్రవక్త సహచరులలో ఒకరు. ఈయన అప్పుడప్పుడే ఇస్లాంలో చేరిన న్యూ ముస్లిం సహాబీ. అంతకు ముందు ఆయన ఇస్లాం మర్యాదలను గురించి విని ఉన్నారు. ఎవరయినా తుమ్మి ‘అల్‌హమ్దులిల్లాహ్‌ా’ అని పలికినపుడు, దానికి జవాబుగా ‘యర్‌హముకల్లాహ్‌ా’ అని చెప్పటం ధర్మం అన్న విషయం ఆ న్యూ ముస్లిం సహాబికి తెలుసు. సామూహిక నమాజు వేళ కాగానే అందరూ నమాజుకు ఉపక్రమించారు. ఆ న్యూ ముస్లిం సహాబి కూడా అందరితో కలిసి నమాజుకు నిలబడ్డారు. నమాజు మధ్యలో ఎవరికో తుమ్ము వచ్చింది. అంతే! దానికి సమాధానంగా ముఆవియ (ర ) ‘యర్‌హముకల్లాహ్‌ా!’ అని బిగ్గరగా అనేశారు. కొంతమంది సహాబా ఆయన్ని తీక్షణంగా చూశారు. ‘అదేంటీ, మీరంతా నన్ను అలా చూస్తారేమిటి?’ అని ముఆవియ (ర ) నమాజులోనే అడిగేశారు. అప్పుడు సహాబీలలో కొందరు కాళ్ళపై చేతులు చరిచి ‘సుబ్‌హానల్లాహ్‌ా’ అన్నారు. ‘ఓహో! నమాజులో ఇలా మాట్లాడకూడదు కాబోలు’ అనుకుని మౌనం వహించారు ముఆవియా.సలాం చెప్పి నమాజు ముగించిన తర్వాత దైవప్రవక్త (స ) వెనుతిరిగి, ”నమాజు మధ్యలో మాట్లాడిందెవరు?” అని అడిగారు. జనులంతా ముఆవియా వైపు సైగ చేశారు.
      ఆ సన్నివేశాన్ని ముఆవియ (ర ) మాటల్లోనే దర్శించండి – ఆయన ఇలా అన్నారు: ”నా తల్లిదండ్రులను దైవప్రవక్త (స ) కు అర్పింతు! నేను ప్రవక్త (స ) వారిని మించిన సంస్కర్తను అంతకుముందుగానీ, ఆ తర్వాత గానీ ఎక్కడా చూడలేదు. ఆయన (స ) నన్ను కోప్పడలేదు సరి కదా, ఆప్యాయంగా నన్ను దగ్గరకు పిలిచి, ”ఇది నమాజు నాయనా! నమాజులో మాట్లాడకూడదు కదా! నమాజులో ఖుర్‌ఆన్‌ పఠించ బడుతుంది. దైవనామం స్మరించబడుతుంది. దైవ కీర్తన జరుగుతుంది” అని మాత్రం సుతిమెత్తగా చెప్పారు.

      సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

      నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా. అంతిమ దైవప్రవక్త (స ) ద్వారా ప్రజా బాహుళ్యంలో వచ్చిన సామాజిక, నైతిక పరివర్తనలో కీలక పాత్ర పోషించింది నమాజే అంటే అతిశయోక్తి కాదు. వస్త్రధారణపై బొత్తిగా అవగాహన లేని అరబ్బు అనాగరికులను ఇస్లాం కొన్నేండ్లలోనే సభ్యతాసంస్కారాల ఉన్నతికి చేర్చిందంటే అందులో నమాజ్‌ నిర్వహించిన భూమిక అంతా ఇంతా కాదు.
      ఎందుకంటే నమాజు చేసే వ్యక్తి నగ్నంగా గానీ, అర్థ నగ్నంగా గానీ, ఉండలేడు. ముఖ్యంగా అతను తన మర్మస్థానాలను పరిశుభ్రమైన దుస్తులతో మరుగు పరచాలి. శరీరంలోని నిర్ణీత భాగంపై సతర్‌ (ఆచ్ఛాదన) ఉండాలి. అరేబియాలోని పల్లెటూరి బైతులకు ఈ సంస్కారం లేకుండింది. ఆఖరికి పట్టణాలలో నివసించేవారు కూడా వస్త్రధారణ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కురైషు మహిళలు హజ్‌ చేసినప్పుడు-నగ్నంగా-కాబా ప్రదక్షిణ చేసేవారు.
      అయితే ఇస్లాం రాగానే శరీరంపై ఆచ్ఛాదనను అనివార్యంగా ఖరారు చేసింది. శరీరాచ్ఛాదన లేకుండా చేసే నమాజ్‌ నెరవేరదని ప్రకటించింది-
      ”ఓ ఆదం సంతతి వారలారా! మీరు (నమాజు నిమిత్తం) మస్జిదులకు వచ్చిన ప్రతి సారీ మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి”. (అల్‌ ఆరాఫ్‌ – 31)
      నమాజులో పురుషులైతే కనీసం నాభి నుంచి మోకాళ్ళ క్రింది వరకు శరీరాన్ని వస్త్రంతో కప్పి ఉంచటం తప్పనిసరి. స్త్రీలకయితే నఖశిఖపర్యంతం ఆచ్ఛాదన ఉండి తీరాలి. ఈ విషయాన్ని ఇస్లాం రోజుకు ఐదు సార్లు మరీ మరీ జ్ఞాపకం చేసి తన అనుయాయుల్లో నిద్రాణమై ఉన్న లజ్జాబిడియాలను తట్టి లేపుతుంది. నాగరికతకు ఆమడ దూరాన ఉండే ఆఫ్రికా ఖండంలోని ఆటవికులు, ఆది వాసులు సయితం నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.

      నమాజు వల్ల సభ్యతాసంస్కారాలకు అలవాటు పడ్డారు.

      సలాహ్ (నమాజు) విధానం


      ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు – మీరు అలాగే నమాజు చదవండి, నన్నుఏ విధంగా నమాజు చదవుతూ చూస్తున్నారో. బుఖారి
      నమాజు చేయు విధానం వివరంగా క్రింద ఇవ్వబడినది.
      ఖియామ్
      అంటే నమాజు చదువుటకు నిలబడుట
      తక్బీర్– ఎ– తహ్రీమ
      అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించడం
      రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
      కుడిచేతిని ఎడమచేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచవలెను.
      “సుబహానకల్లాహుమ్మ వబిహందిక వతబారకస్ముక వతఆల జద్దుక వలా ఇలాహగైరుక” అని చదవాలి. దీనిని సనా అంటారు.
      సజ్దా చేయనున్న చోట దృష్టిని ఉంచాలి
      సూరతుల్ ఫాతిహా
      మొదట “అఊజు బిల్లాహి మినష్షైతానిర్రజీం” చదవాలి
      “బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం” అనాలి
      తరువాత సూరతుల్ ఫాతిహా చదవాలి
      గమనిక׃ సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీన్ (ఓ అల్లాహ్ ! మా విన్నపాల్నిఅంగీకరించు) అనాలి
      సూరతుల్ ఫాతిహా తరువాత ఏదైనా ఒక పూర్తి సూరహ్ లేదా సూరహ్ లోని కొన్ని వచనాలు (ఆయత్ లు) చదవాలి.
      రుకూ చెయ్యాలి
      రెండు చేతులనూ అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తడం
      నడుమును (వీపును) ముందుకు వంచి, రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకుని, కంటి చూపు సజ్దా చేసేచోట ఉంచవలెను. దీనిని రుకూ అంటారు
      రుకూ లో మూడు లేక ఐదు లేక ఏడు సార్లు సుబ్హాన రబ్బియల్ అజీం అనాలి
      రుకూ నుండి లేవాలి
      రుకూ నుంచి లేచి నిలబడుతూ, రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవులకు సమంగా లేపుతూ నమాజు చదివించే వారైనా లేదా ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి అయినా సమిఅల్లాహులిమన్ హమిద అనాలి
      అందరూ రబ్బనా వలకల్ హమ్ద్ అనాలి
      సజ్దా చేయాలి
      సజ్దాలోకి వెళ్లడానికి ముందు అల్లాహు అక్బర్ అనాలి
      సజ్దానందు మూడు లేక ఐదు లేక ఏడు సార్లు సుబ్హాన రబ్బియల్ ఆఁలా అనాలి
      సజ్దా లో ఏడు అంగాలు భూమిని తాకాలి – 1. ముఖం (నుదురు,ముక్కు) 2. రెండు చేతులు 3. రెండు మోకాళ్ళు 4. రెండు పాదాల వ్రేళ్ళు
      జల్సఇస్తిరాహత్ చేయాలి– అంటే రెండు సజ్దాల నడుమ కూర్చోడం
      సజ్దా నుండి తల ఎత్తునప్పుడు అల్లాహు అక్బర్ అనాలి
      రెండు సజ్దాల నడుమ నిదానంగా కూర్చొని మూడుసార్లు రబ్బిగ్ఫిర్లి అనాలి
      మొదటి రకాతు పూర్తి అయ్యాక రెండవ రకాతుకై ఖియామ్ చేయ్యడం అంటే లేచి నిలబడడం
      లేచి నిలబడుతూ అల్లాహు అక్బర్ అనాలి
      మొదటి తషహ్హుద్ చేయాలి׃అంటే రెండు రకాతుల తరువాత తషహ్హుద్ లో కూర్చోవాలి
      రెండు రకాతుల తర్వాత కూర్చుని ఈ దుఆ చదవాలి
      “అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు వస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”
      అనువాదం׃ స్తుతి, శారీరక – ఆర్ధిక పరమైన ఆరాధనలన్నియూ అల్లాహ్ కొరకే, ఓ ప్రవక్తా ! మీపై అల్లాహ్ కరుణా కటాక్షాలు మరియు శుభాలు కురియుగాక, అల్లాహ్ శుభాలు మాపై మరియు పుణ్యాత్ములైన అల్లాహ్ దాసులపై కురియుగాక, నేను సాక్ష్యమిస్తున్నాను వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడు లేడు, కేవలం ఒక్క అల్లాహ్ తప్ప మరియు సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని.
      ఆఖరి తషహ్హుద్׃అత్తహియ్యాతు తరువాత దరూద్ షరీఫ్ చదవాలి.
      “అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్.
      అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్ త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదున్ మజీద్”
      ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై కరుణ చూపించు మరియు ఆయన పరివారం పై కూడా – ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారంపై కరుణ చూపించావో, నిశ్చయంగా నీవు ప్రశంనీయుడవూ, విధాతవూనూ.
      ఓ అల్లాహ్ ! ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారంపై కూడా , ఏ విధంగానైతే నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం పై మరియు ఆయన పరివారంపై శుభాలు కురిపించావో, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవూ, విధాతవూనూ.
      దరూద్ షరీఫ్ తరువాత ఈ దుఆ చదవాలి
      “అల్లాహుమ్మఇన్నీ అఊజుబిక మిన్ అజాబి జహన్నమ వ అజాబిల్ ఖబ్ రి వమిన్ ఫిత్నతిల్ మహ్యావల్ మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్” – ఓ అల్లాహ్ ! నేను నీ శరణువేడుతున్నాను నరకయాతన నుండి మరియు సమాధి యాతన నుండి, మరియు శరణు వేడుకుంటున్నాను జీవన్మరణాల నుండి మరియు మసీహ్ దజ్జాల్ చెడు నుండి.
      సలాం చేయడం
      నమాజు ముగించునప్పుడు ముఖాన్ని కుడివైపునకు మరల్చి అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అనాలి
      మళ్ళీ ఎడమవైపుకు కూడా ముఖాన్ని మరల్చి, అదే విధంగా అనాలి
      నమాజు చేస్తున్నప్పుడు లగ్నము – వినమ్రతలతో పాటు నెమ్మద – నిదానం కూడా ఉండాలి

      సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు


      నమాజు చేసే ప్రతి వ్యక్తీ శుచీ, శుభ్రతలను పాటించటం అవశ్యం. ఇస్లాం తొలి ఆజ్ఞలలో తహారత్‌ ఒకటి. దైవప్రవక్త ముహమ్మద్‌ (స)పై రెండవసారి అవతరించిన దివ్యవాణి శుచీశుభ్రల (తహారత్‌) కు సంబంధించినదే. ఉదాహరణకు:- ”నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. అశుద్ధతను వదలిపెట్టు”. (అల్‌ ముద్దస్సిర్‌ – 4,5)
      అందుకే ఇస్లాం పరిశుభ్రత, పరిశుద్ధతలకు సంబంధించిన సూత్రాలను నిర్థారించింది. దైవప్రవక్త (స) తన బోధనల ద్వారా దాని సరిహద్దులను ఖరారు చేశారు. నమాజు సజావుగా నెరవేరాలంటే మనిషి శరీరం, అతను తొడిగే దుస్తులతోపాటు అతను నమాజు చేసే స్థలం కూడా పరిశుభ్రంగా ఉండాలి – ఎలాంటి మలినం ఉండకూడదు. ఒకప్పుడు అరబ్బులు కూడా ఇతర అనాగరిక జాతుల మాదిరిగా శుచీశుభ్రతలను బొత్తిగా పాటించేవారు కాదు. ఉదాహరణకు ఒక పల్లెటూరి బైతు సాక్షాత్తూ మస్జిదె నబవీలోనే – అందరి సమక్షంలో – మూత్రం పోసేశాడు. సహచరులు (ర) అతన్ని కొట్టేందుకు ఎగబడ్డారు. దైవప్రవక్త (స) వారందరినీ వారించారు. ”నాయనా! ఇది ప్రార్థన చేసే స్థలం. ఇలాంటి చోట మల మూత్ర విసర్జన చేయకూడద”ని ఎంతో నిదానంగా నచ్చచెప్పారు. ఆ వ్యక్తి మూత్రం పోసిన చోట నీళ్లు కుమ్మరించమని ప్రియసహచరుల్ని పురమాయించారు.
      ఒకసారి ఆయన (స) ఒక సమాధి దగ్గరి నుంచి సాగిపోతూ, ”ఈ సమాధిలోని వ్యక్తి యాతనకు గురవుతున్నాడు. ఇంతకీ ఈ వ్యక్తి (వల్ల జరిగిన అశ్రద్ధ ఏమిటంటే) మూత్రపు తుంపరలు తన శరీరంపై పడుతున్నా లక్ష్యపెట్టేవాడు కాదు” అన్నారు. ఈ విధంగా ముస్లింలు శుచీశుభ్రతల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలని నొక్కి వక్కాణించబడింది. కాలకృత్యాలు తీర్చుకునే విషయంలోనూ, వుజూ గుసుల్‌ విషయంలోనూ గొప్ప నాగరీక జాతులు సయితం పాటించని మర్యాదలు ముస్లింలకు బోధించ బడ్డాయి.
      తమ శరీరాన్ని, దుస్తులను, నివాస గృహాలను అన్ని రకాల మలినాల నుండి కాపాడుకుంటూ షరీయతు బద్ధంగా తహారత్‌ పాటించే ప్రవక్త శిష్యులను అల్లాహ్‌ ఈ విధంగా కొనియాడాడు:
      ”ఈ మస్జిద్‌లో ఉండే వారిలో కొందరు బాగా పరిశుద్ధతను పాటించటాన్ని ఇష్టపడతారు. అల్లాహ్‌కు పరిశుద్ధతను పాటించే వారంటే ఎంతో ఇష్టం”. (దివ్యఖుర్‌ఆన్‌ – 9:108)
      దేవుని ప్రేమాభిమానానికి పరిశుభ్రత (తహారత్‌) ఒక ప్రధాన కారణమైనప్పుడు ఈ భాగ్యానికి ఎవరయినా ఎలా దూరంగా ఉండగలుగుతారు??
      నమాజు వల్ల కలిగే ఇంకొక ప్రయోజనమేమిటంటే, అది మనిషిని అనుదినం నీటుగా ఉండేలా చేస్తుంది. అతడు నిత్యం తన ఒంటిని, దుస్తులను శుభ్రంగా ఉంచుకుంటాడు. నమాజు చేసే వ్యక్తి రోజుకు ఐదు సార్లు తన ముఖాన్ని, కాళ్ళుచేతులను నియమబద్ధంగా కడుక్కుంటాడు. ముక్కులో సయితం నీళ్ళు జొన్పి నాసిక పుటాలను శుభ్రపరుస్తాడు. దీనివల్ల వైద్య పరంగా కలిగే లాభాలు ఎన్నో. ముక్కు పుటాల మార్గంగ ుండా శరీరం లోపలికి వెళ్ళే సూక్ష్మక్రిములు ఈ ‘వుజూ’ ద్వారా దూరమవుతాయి. ముక్కులో సయితం నీరు పోసి శుభ్రపరచే శిక్షణ బహుశా ఇస్లాం ఒక్కటే ఇచ్చింది. ప్రపంచంలో మరే మతం కూడా ఈ శిక్షణ ఇవ్వదు. దీన్నిబట్టి ఇస్లాం ఆదేశాలు వైద్యశాస్త్రం దృష్ట్యా కూడా ఎంతో మేలైనవే. ఒకప్పుడు నీరు అతి తక్కువ మోతాదులో లభ్యమయ్యే అరబ్బు ప్రదేశంలో రోజుకు ఐదు సార్లు ‘వుజూ’ చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పటం ఇస్లాంకే చెల్లింది.
      అరబ్బులు – ముఖ్యంగా పల్లెటూళ్లలోని వారు – పల్లు తోము కోవడం పట్ల మరీ సోమరితనం ప్రదర్శించేవారు. తత్కారణంగా నోట్లో నుంచి దుర్వాసన రావటమేగాకుండా, రకరకాల దంత వ్యాధులు కూడా సోకేవి. మహా ప్రవక్త (స) ప్రతి నమాజు సందర్భంగా ‘మిస్వాక్‌’ (దంత ధావనం) చేయాలని తాకీదు చేశారు. ”ఒకవేళ నా అనుచర సమాజం ఇబ్బందికి గురవ దనుకుంటే మిస్వాక్‌ చేయటాన్ని అవశ్యంగా ఖరారు చేెసి ఉండేవాణ్ణి” అని ఆయన (స) చెప్పటం గమనార్హం.
      అలాగే వీలునుబట్టి స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేశాక పొడి దుస్తులు ధరించటం, సుగంధ ద్రవ్యాలు పూసుకోవటం మంచిది. ముఖ్యంగా శుక్రవారం (జుమా) నమాజుకైతే స్నానం చేసి మరీ రావాలి

      నమాజు చేద్ధాం! ఛలో, ఛలో!!


      ప్రియ మిత్రుల్లారా! ధీర విస్వాసి, గొప్ప సహాబీ ఖుబైబ్‌ బిన్‌ ఆదీ గరించి విన్నారా? ఇస్లాం స్వీకరించినందుకుగాను అవిశ్వాసులు ఆయన్ను చిత్రహింసలు పెట్టి మరీ చంపారు. దారుణంగా హింసిస్తూ ప్రాణం పోవడానికి కొన్ని ఘడియల ముందు ‘నీ చివరి కోరిక ఏమిట?’ గుండెల్లో గునపం దింపి అడిగారు. అందుకు ఆయన తట పటాయించకుండా ‘రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష’ అని సమాధానమిచ్చారు. వారి నుండి లభించిన అను మతితో రెండు రకాతులు పూర్తి చేసి ఇలా అన్నారు: ”ఇది నా జీవితపు అంతిమ ఆరాధన గనక సుదీర్ఘంగా చేయాలన్న అభిలాష ఎంతో ఉన్నా, ‘చావు భయంతో నమాజుని సుదీర్ఘం చేసి చదువుతున్నాడు’ అన్న అపవాదు అవిశ్వాసల తరఫున రాకూడదని నేను నా ప్రార్థనను సంక్షిప్తంగా చేసి ముగించాను”.
      ప్రియ మిత్రుల్లారా! యాతనలతో కూడిన, చిత్రహింసలతో కూడిన చావు అందరికి రాకపోవచ్చు. కానీ, అందరూ చావడం మాత్రం ఖాయం. ఒకవేళ మనకే మరణ ఘడియలు దాపురించి ‘నీ చివరి కోరిక ఏమిట?’ అని ఎవరయినా మనల్ని అడిగినా, అడగకపోయినా మన చివరి కోరికి ఏమై ఉంటుందో? ఏమై ఉండాలో? మనలోని ప్రతి ఒక్కరు ఆత్మ సమీక్ష చేసుకోవాలి. అమ్మానాన్నలను చూడాలనుకుం టామా? భార్యాపిల్లలతో గడపాలనుకుంటామా? మన అభిమాన వ్యక్తి తో భేటి అవ్వాలనుకుంటామా? ఏదైనా ఆట ఆడాలనుకుంటామా? ఆస్తిపాస్తులను మరొక్కమారు లెక్కబెట్టుకోవాలనుకుంటామా? మిగిలి ఉన్న ఆ కొద్ది ఘడియల్ని సయితం సినిమాలు, సిత్రాలు అంటూ వృధా చేస్తామా?  లేదా ‘నన్నొదలండి, రెండు రకాతుల నమాజు చేసుకోవా లన్నది నా చివరి ఆకాంక్ష’ అని అల్లాహ్‌ా పట్ల మనకున్న అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తామా?
      అయినా అంత పునీతమయిన మాట మన నోట వెలువడాలంటే, నమాజు మధురానుభూతి తాలూకు పూర్వానుభవం మనకుంటేనే కదా? జీవితంలో ఒకట్రెండు మార్లు తోచినప్పుడు, తోచిన విధంగా వారానికో, మాసానికో, సంవత్సరానికో ఒక సారి నమాజు చేసే వారికి నమాజు మహిమ ఎలా తెలుస్తుంది? చెప్పండి. ‘ఒక నమాజు మరో నమాజుకి మధ్య జరిగే పాపాలను ప్రక్షాళిస్తుంది’ అన్నారు ప్రవక్త (స). అసలు నమాజే చదవని వ్యక్తి తన పాపాల్ని ఏం చేెస్తాడు?  అతని పాప ప్రక్షాళనామార్గం ఏమిటి? అతను పాప ఊబి నుండి విముక్తి పొందే దారేది?
      ప్రియ మిత్రుల్లారా! రోజుకి పది సార్లు ‘హయ్యా అలస్స్వలాహ్‌ – నమాజు వైపునకు రండి!’ అని, 10 సార్లు ‘హయ్యా అలల్‌ ఫలాహ్‌ా- సాఫల్యం వైపునకు రండి!’ అని అయిదు పూటల నమాజు కోసం ఇచ్చే అజాన్‌ రూపంలో స్వయంగా అల్లాహ్‌ా మనల్ని పిలుపునిస్తున్నాడు. అయినా మనం ఆయన ఆప్త పిలుపుకి స్పందించడం లేదు. ‘నేను హాజరయ్యాను స్వామీ’ అని జవాబు పలకడం లేదు. ‘కర్మకు తగ్గ ఫలం’ అన్నట్టు అల్లాహ్‌ా ఆప్త పిలుపు పట్ల ఇలా అమర్యాదగా వ్యవహ రించిన వ్యక్తిని అల్లాహ్‌ా అభిమానించి సత్కరిస్తాడని, సన్మానిస్తాడని ఎలా భావించగలం? చెప్పండి. నిజమయిన కీర్తి ఎవరికి వారుగా ఇచ్చుకునేది, ఒకరిస్తే పుచ్చుకునేది కాదు. అల్లాహ్‌ా అనుగ్రహించినది మాత్రే నిజమైన కీర్తి, వాస్తవ గౌరవం. ‘దాసుడు అత్యంత సమీపంగా దైవానికి సజ్దా స్థితిలో ఉంటాడు’ అని ప్రవక్త (స) వారు అన్నారు. మరే వ్యక్తయితే జీవితంలో ఒక్కసారి కూడా అల్లాహ్‌ా సన్నిధిలో పూర్ణ హృద యంతో, పూర్ణ బలంతో, పూర్ణ విశ్వాసంతో ఒక్క సజ్దా కూడా చేసి ఎరుగడో అతని వదనం దేదీప్యమానం ఎలా అవుతుంది. అతని జీవి తం నిండు కళను ఎలా సంతరించుకుంటుంది?అతనికి కీర్తి ఎలా ఒన
      గూడుతుంది?అతనికి  రేపు తీర్పు దినాన పుల్‌సిఇరాత్‌ వారధి దాటేం దుకు కావాల్సిన జ్యోతి ఎలా ప్రాప్తిస్తుంది? శరీరానికే తలమానికం అయిన శిరస్సును ఆ సర్వలోక పాలనాధీశుని సన్నిధానంలో వంచి నప్పుడే దానికి సిసలైన గౌరవం అసలయిన కీర్తి అని ఎరుగని వ్యక్తి ఎలా సంస్కారంతుడు అనిపించుకుంటాడు? చేసిన అర్థ రూపాయి సహాయానికి కృతజ్ఞత కోరుకునే మనిషి అల్లాహ్‌ ప్రసాదించి అనన్య అనుగ్రహాల్ని అనుభవిస్తూ, అగణ్య వరాలను పొంది కూడా అల్లాహ్‌ పట్ల పూర్తి అణుకువ కూడిన ఒక సజ్దా చేయకపోవడం ఎంత దుర దృష్టకరం!  దాసుడు దైవ సన్నిధికిలో నిలబడి అల్లాహ్‌ను స్మరించ డమే ఆలస్యం ‘నేనున్నాను’ అంటూ బదులిస్తాడు. అట్టి దయాసాగరు ని సన్నిధికి వెళ్ళనివాడు ఎంత దరిద్రుడో ఆలోచించండి.
      ప్రియ మిత్రుల్లారా! నమాజు ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. అల్లాహ్‌ా ఆదేశం.అల్లాహ్‌ పంపగ వచ్చిన ప్రవక్తలందరూ ఎంతో ఇష్టం గా పాటించిన సంప్రదాయం. మానవుల్లోనే శ్రేష్టులయిన ప్రవక్తలు భక్త్తిప్రపత్తులతో నమాజు చేయడం, సామాన్య వ్యక్తులయిన మనం చేయకపోవడం దేన్ని సూచిస్తుందో యోచించండి! ఇది మనలో దుర హంకార వైఖరికి నిదర్శనం కాదా? లేదా ‘దురంహాకర దురంధురుల వైపు అల్లాహ్‌ కన్నెత్తి కూడా చూడడు’ అని ప్రవక్త (స) చేసిన హెచ్చ రిక మన చెవిన పడలేదా?
      కొందరు సంపద లేమితో సతమతమవుతూ ఉండొచ్చు. కొందరు సంతాన లేమితో బాధ పడుతూ ఉండొచ్చు. కొందరు సంతాప సము ద్రంలో మునిగి ఉండొచ్చు. అన్ని రోగాలకు, అన్ని బాధలకు, అన్ని సమస్యలకు పరిష్కారం నమాజు. నమాజు చదివి ప్రవక్త జకరియ్యా (అ) పొందిన శుభవార్తను మనమూ పొందాలి. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”కుటీరంలో నిలబడి (జకరియ్యా -అ)నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ‘అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్‌ వాక్కును ధృవ పరుస్తాడు.  నాయకుడవుతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, దైవ వర్తనులకోవకు చెందినవాడై ఉంటాడు” అని చెప్పారు.   (ఆలి ఇమ్రాన్‌: 39)
      ప్రజలు నమాజు చేసుకుంటున్నారు.నమాజు చెయ్యకుండా ఓ మూల నిలబడి ఉన్న వ్యక్తినుద్దేశించి ”ఏమిటి? నువ్వు ముస్లింవి కాదా?”అని ఆరా తీశారు ప్రవక్త (స). రేపు ప్రళయదినాన నమాజు   పట్ల   మన నిర్లక్ష్యాన్ని చూసి ‘ఏమిటి మీరు ముస్లింలు కారా?’ అని ప్రవక్త (స) మనల్ని నిలదీయడం మనకు ఇష్టమేనా?
      నమాజు సలిపే ప్రతి వ్యక్తి ముఖారవిందంలో ప్రార్థనా తాలూకు తేజస్సు తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రజల నుదుళ్ళపై కనబడే నల్లని మచ్చ కాదు.. అల్లాహ్‌ ఖుర్‌ఆన్‌లో పేర్కొన్న ఛాయ. నల్ల ఛాయో, తెల్ల ఛాయో, పశుపు పచ్చని ఛాయో, ఏర్ర ఛాయో కాదు; అది అక్షరాల నమాజు ఛాయ. ”అల్లాహ్‌ కృపను, ఆయన ప్రసన్న తను చూరగొనే ప్రయత్నంలో వారు వినమ్రులయి రుకూ చేయ డాన్ని, సజ్దా చేయడాన్ని నీవు చూస్తావు. వారి సజ్దా ప్రత్యేక ప్రభా వం వారి ముఖార ందాలపై తొణికిసలాడుతూ ఉంటుంది.”  (అల్‌ పతహ్‌: 29)
      అల్లాహ్‌ాకు మిక్కిలి ప్రియమయిన నమాజు ఛాయను నోచుకో కుండా పోయిన వ్యక్తి ఎంత మేలిమిచ్ఛాయ కలిగి ఉన్నా అంతిమం గా నరకాగ్నిలో కాలి నల్లబడాల్సిందే! నరకవాసుల గురించి తెలియ జేస్తూ అల్లాహ్‌ా ఇలా అంటున్నాడు: ”వాడు సత్యాన్ని ధృవీకరించనూ లేదు. నమాజు చదవనూ లేదు. పైగా వాడు ధిక్కరించాడు. వెను తిరిగి పోయాడు. మిడిసి పడుతూ తన ఇంటి వారల వైపు వెళ్ళి పోయాడు. శోచనీయనం! నీ వైఖరి కడు శోచనీయం!! మరీ విచార కరం! నీ ధోరణి మిక్కిలి విచారకరం!!” (ఖియామా:31-35)
      ”ఆ రోజు (స్వర్గవాసులు నరకవాసుల్ని ఉద్దేశించి) ఇంతకీ ఏ విష యం మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చింది? అని అడుగుతారు. వారి లా సమాధానం ఇస్తారు. ‘మేము నమాజు చేసేవారము కాము. నిరుపేదలకు అన్నం పెట్టే వారమూ కాము. పైగా మేము పిడి వాదన చేసేవారితో చేరి వాదోపవాదాలలో మునిగి ఉండేవారము. ప్రతిఫల దినాన్ని ధిక్కరించేవాళ్ళము. తుదకు మాకు మరణం వచ్చేసింది”. (దహ్ర్‌ా: 43-47)
      మరి మనం నరకవాసుల్లోనే ఉండిపోదామా? స్వర్గవాసుల స్థాయి ని అందుకునే అవిరళ కృషికి పూనుకుందామా? మరి స్వర్గవాసులు ఎవరంటారా? అదీ ఆ కృపాసాగరుని మాటల్లోని వినండి – ”వారు అగోచరాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు”. (బఖరా:2)
      అల్లాహ్‌ కృప వల్ల మనం విశ్వాసులం; మంచిదే. కానీ, నమాజు చదవడం లేదు ఎందుకు?
      తమ తమ ఇళ్ళకు వెళ్ళాలనుకున్న యువకుల్ని ఉద్దేశించి ప్రవక్త (స) వారు చేసిన ప్రధమ హితవు ఏమిటో తెలుసా? ”నమాజు స్థాపించండి” అన్నది. నమాజు చదివే వ్యక్తి అల్లాహ్‌ాకు అత్యంత సమీపంగా ఉంటే, చదవని వ్యక్తి అందరికన్నా దూరంగా ఉంటాడు. అమ్మనాన్న, అక్కాచెల్లెల్లు, అన్నాదమ్ముళ్లు, ఆప్తులు స్నేహితులు – ఇలా ఎవరితోనయినా దూరంగా ఉండి బ్రతకొచ్చు కానీ, అల్లాహ్‌ా కు, ఆయన కృపాకటాక్షాలకు దూరంగా ఉండి ఎవరు బ్రతికి బట్ట కట్టగలరు చెప్పండి! ఏమిటి, ”ఆ తర్వాత కొందరు అయోగ్యులు వచ్చి నమాజులను వృధా చేశారు. మనోవాంఛలకు బానిసలయి బ్రతికారు” (మర్యమ్‌; 59) అని స్వయంగా అల్లాహ్‌ాయో ‘అయో గ్యులు’ అన్న వారి జాబితాలో చేరడం మనకిష్టమేనా.? ‘బే నమాజీ’ అని అందరూ ఎద్దేవ చెయడం మన నచ్చుతుందా?
      మనం  ఎంత అంగ బలం, అర్థ బలం, అధికార బలమయినా కలిగి ఉండొచ్చు. అందం రీత్యా మనం విశ్వ సుందరులే కావచ్చు. కానీ, మనం నమాజును వేళకు చేయకపోతే అల్లాహ్‌ దగ్గర మాత్రం కటిక దరిద్రులం, అందవిహీనులం, అజ్ఞానులం, దుష్టులం, దుర్మార్గు లమే. ఇది మనకు సమ్మతమేనా?
      ప్రియ మిత్రుల్లారా! అల్‌హమ్దులిల్లాహ్‌ా మనం రోజుకి అయిదు సార్లు అజాన్‌ వింటున్నాము. ఖుర్‌ఆన్ను దైవగ్రంథంగా విశ్వసిస్తున్నాము. ఖుర్‌ఆన్‌లో నమాజును స్థాపించండి అన్న ఆదేశం అనేెక సార్లు వచ్చిం దన్నదీ మనకు ఎరుకే. ఖుర్‌ఆన్‌ అల్లాహ్‌ా ప్రోక్తం అని బలంగా విశ్వ సించే మనలో రోజుకు ఆయిదు సార్లు నమాజు పిలుపు విని కూడా స్పందన కనబడటం లేదంటే ఏమిటి అర్థం? గుండె అని గుడిలో దైవ భీతి ఉన్నాట్టా? లేదా ఐహిక లాలస, కాంక్షల దాస్యం గూడు కట్టుకు న్నట్టా? ”ఏమిటి. విశ్వాసుల హృదయాలు అల్లాహ్‌ా సంస్మరణ పట్ల, ఆయన అవతరింపజేసిన సత్యం పట్ల మొత్తబడే సమయం ఇంకా ఆసన్నం కాలేదా?” (హదీద్‌: 16)
      చూడండి! మనం ఒక కార్యాలయంలోనో, ఒక పాఠశాలలోనో పని చేస్తున్నామనుకోండి.ఆ కార్యాలయం, ఆ పాఠశాల కేటాయించిన సమ యానికి బద్దులయి మసలుకోమా?ఉద్యోగ విషయంలో, వ్యాపార విష యంలో, వివాహ విషయంలో, జీవిత ఇతర విషయాల్లో ఖచ్చితంగా సమయపాలనను పాటించే మనం-”నిశ్వయంగా నమాజును నిర్థారిత వేళల్లో చేయడం విశ్వాసులకు విధిగా చేయబడిది”. (నిసా:103) అని స్వయంగా ఆ సర్వేశ్వరుడే సెలవిస్తుంటే ఆ మాత్రం నీతిని నమాజు విషయంలో పాటించలేకపోతున్నాము. పనీ చేయక, కష్టా పడక అదృ ష్టం వరించాలనుకోవడం, యజమాని నుండి వెతనాన్ని, ఫలితాన్ని కోరుకోవడం దురాశే కదా! మరి దురాశేమో దుఃఖానికి చేటాయో!
      ప్రియ మిత్రుల్లారా! సాధారణ దినాల్లోనే కాదు, సంబర ఘడియల్లో సయితం ‘మేము మా ఈ పండుగ రోజుని నమాజుతో ప్రారంభి స్తాము’ అని ప్రవక్త (స) వారు చెబుతుంటే, మనం మన దైనందిన జీవితాన్ని నమాజుతో ప్రారంభించకపోవడం శుభమా? అశుభమా? ఆలోచించండి! మనం శ్వాస పీల్చుకుంటున్న దినం పండుగ దినమే కావచ్చు. షడ్రుచులు మేళవించిన వంటకాలే మనం ఆరగించి ఉం డొచ్చు. నూతన వస్త్రాలు ధరించి మనం నవాబుల్లానే నడుస్తుండొచ్చు, అమ్మనాన్నలు, బంధుమిత్రులు, ఇరుగపొరుగు వారితో యమ జోరు గా వెళ్ళి పలుకరించే ఉండొచ్చు; కానీవీటన్నింటిని మనకు అనుగ్ర  హించిన ఆ నిజ స్వామి సన్నిధానానికి మనం హాజరు కాలేదంటే మనం అనుకుంటున్న ఈ పండగ కూడా  పనికిమాలిందే. ఒక్క మాటలో చెప్పాలంటే, అల్లాహ్‌ా విధేయతలో గడిపిన ప్రతి దినం పండగే. అది లేని ప్రతి క్షణం దండగే.
      ప్రవక్త (స) వారి సహచరుల్లో ఎవరి వల్లయినా ఒక నమాజు తప్పి పోతే ‘తన మొత్తం కుటుంబాన్ని పోగుట్టుకున్నట్లు’ వారు ఫీలయ్యే వారు. అవును, ప్రార్థనా ప్రాశస్త్యం వారికి తెలిసినంతగా ఎవరికి తెలి యదు. ఒక్క పూట నమాజు తప్పితేనే వారు అంతగా విలవిల్లాడి పోతున్నారే, మరి మనమేమో రోజులు, వారాలు, నెలలు, ఏండ్ల తర బడి నమాజులను వదులుతూ కూడా చలించడం లేదంటే, మన నుదు ళ్ళపై మడతలు పడటం లేదంటే, మనకు బాధ కలగటం లేదంటే మనలో విశ్వాసం ఉన్నాట్టా, లేనట్టా? ‘నా కంటి చలువ నమాజులో ఉంచ బడింది’ అని స్వయంగా ప్రవక్త (స) వారు సెలువిస్తున్నారు. అంతిమ దినాల్లో నడవలేని స్థితిలో ఇద్దరి సహాయమ కాళిఓలడ్చుకు ంటూ వచ్చి సామూహిక నమాజులో పాల్గొంటున్నారు. మరి మన మేమో ‘సినిమాలు, సిత్రాలు, వ్యర్థ కార్యక్రమాల్ని చూసి మన కళ్లను చల్లార్చుకోవాలనుకుంటున్నామే దీన్నేమనాలి? ”నమాజు స్థాపించే వారిని ప్రశంసాత్మక స్థానం మీద ప్రతిష్టింప జేస్తాను” అని అల్లాహ్‌ా మాటిస్తుంటే, మనమేమో అపకీర్తి అడుసులోనే అట్టడుగున పడి ఉండ టాన్నే ఇష్టపడుతున్నామే, దీన్నేమంటారు?
      ”అల్లాహ్‌ వారి ఇళ్ళను నిప్పుతో నింపుగాక! వారు మమ్మల్ని అస్ర్‌ నమాజు చేయకుండా చేశారు” అని కందక యుద్ద సమయంలో ప్రవక్త (స) వారు అవిశ్వాసుల్ని అభిశపించారు అంటే ఆలోచించండి, నమాజు ఎంత ఘనతరమయిన ప్రార్థనో! ఆ రోజు యుద్ధ కారణంగా అనేక దైనందిన కార్యాలు వాయిదా పడ్డాయి. ప్రవక్త (స) వాటిని ఖాతరు చేయలేదు. నమాజునే ప్రత్యేకంగా పేర్కొన్నారంటే, సదా దీవె నల్ని కురిపించే ఆయన అధరాలు అభిశపించాయి అంటే, నమాజును వదలడంగానీ, నమాజును చేయకుండా ఆపడంగానీ ఎంత భయంకర నేరమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇస్లాంలోని ప్రతి ఆదేశం గురించి సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంది. కానీ, శ్వాస, స్పృహ ఉన్నంత వరకు ఎటువంటి మినహాయింపు లేని ఆదే శం ఒక్క నమాజు విషయంలోనే ఇవ్వబడింది. చివరికి భీకర పోరు జరుగుతున్నా నమాజును వాయిదా వేయడానికి లేదు అంటూ ఆ స్థితిలో చేసే నమాజు విధానాన్ని ప్రత్యేకంగా అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో పేర్కొన్నాడంటే, అల్‌హమ్దులిల్లాహ్‌ ప్రశాంత వాతావరణంలో నివ సిస్తున్న మనపై నమాజు తాలూకు బాధ్యత ఏపాటిదై ఉంటుందో యోచించాలి. కొత్తగా ఇస్లాం స్వీకరించిన తాయిఫ్‌ ప్రజలు కొన్ని విషయాలలో మినహాయించపు కోరితే మినహాయింపును ప్రకటించిన ప్రవక్త (స), నమాజు విషయంలో కూడా మినహాయింపునివ్వండి అని విన్నవించుకున్నప్పుడు ‘నమాజు లేని మతధర్మంలో శుభమే మిగు లుండదు’ అని చెప్పారంటే నమాజుకు నోచుకోని మన జీవితం ఎలాంటిదో యోచించండి!
      అల్లామా జహబీ (ర) మరణిస్తూ అన్న మాట:”ఏ ఒక్క విధి నమాజు  వదలని శుభ దినంలో నాకు మరణాన్ని ప్రసాదించినందుకు నేను అల్లాహ్‌ాకు వేనవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను’ అన్నా రంటే, అంతిమ దైవప్రవక్త (స) అంతిమ ఘడియల్లో అనేక సార్లు స్పృహ తప్పినా స్పృహ వచ్చిన ప్రతి సారి నమాజు చేయడానికి ప్రయ త్నించేవారంటే, తన గది తెరను తొలగించి నమాజు చేస్తున్న సహచరుల్ని చూసి చల్లని చిరినవ్త్వుకటి ఆయన ఆధరాలపై కదలాడిం దంటే, అంతిమ శ్వాస అగుతున్న సమయంలో సయితం ‘నమాజ, నమాజు…మీ అధీనంలో ఉన్న వారి యెడల ఉత్తమంగా వ్యవహరిం చండి’ అని తాకీదు చేెశారంటే నమాజు ఎంత మహిమాన్వితమయిన ఆరాధనో ఆలోచించండి! ప్రవక్తల, పుణ్యాతుల, సత్పురుషుల, షహీ దుల, ఔలియాల, హదీసువేత్తల  దృష్టిలో అంతటి ఘనపాటి అయిన నమాజు మన దృష్టిలో ఎటువంటి విలువ లేనిదిగా ఉందంటే లోపం ఎవరిదో, ఎవరిలో ఉందో ఎవరి వారే ఆత్మ సమీక్ష  చేసుకోవాలి.