Sunday, August 24, 2014

ఉమ్రా విధానం


 ఉమ్రాని నెరవేర్చాలన్న సంకల్పంతో మస్జిదె హరామ్‌ చేరుకున్నప్పుడు కుడి కాలు పెడుతూ ఈ దుఆ పఠిస్తూ మస్జిదె హరామ్‌లో ప్రవేశించాలి.
 ”బిస్మిల్లాహి వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహి అల్లాహుమ్మగ్‌ఫిర్‌లీ జునూబీ వఫ్‌తహ్‌లీ అబ్‌వాబ రహ్మతిక్‌.”
 ”అవూజు బిల్లాహిల్‌ అజీమ్‌ వ బివజ్‌హిహిల్‌ కరీమ్‌ వ బిసుల్తానిహిల్‌ ఖదీమ్‌ మినష్షైతానిర్రజీమ్‌”.
తవాఫ్‌: కాబాపై దృష్టి పడగానే చేసే దుఆ స్వీకరించబడుతుందని గుర్తుంచుకోండి. తరువాత తవాఫ్‌ (ప్రదక్షిణ) మొదలు పెట్టడానికి హజ్రె అస్వద్‌ వైపు సాగి పోవాలి. వీలైతే దాన్ని ముద్దాడాలి. దాన్ని ముద్దాడే ప్రయత్నంలో ఇతర యాత్రికులను తోసి వేయకూడదు. హజ్రె అస్వద్‌ని తాకేటప్పుడు ఈ దుఆ పఠించాలి:
 ”బిస్మిల్లాహి అల్లాహు అక్బర్‌.అల్లాహుమ్మ ఈమానన్‌ బిక, వ తస్‌దీఖన్‌ బికితాబిక, వ వఫాఅన్‌ బి అహ్‌ాదిక, వ ఇత్తిబాఅన్‌ లిసున్నతి నబియ్యిక (స)”.  ప్రతి ప్రదక్షిణ హజ్రె అస్వద్‌ నుండి ప్రారంభమై హజ్రె అస్వద్‌ దగ్గరే ముగుస్తుంది. రుక్నె యమానీని వీలైతే చేత్తో తాకాలి. లేదంటే సైగ చెయ్యకూడదు. ముద్దాడకూడదు. రుక్నె యామని – హజ్రె అస్వద్‌ల మధ్య ఈ దుఆ పఠించాలి: ”రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్‌ వ ఫిల్‌ ఆఖిరతి హసనతన్‌ వఖినా అజాబన్నార్‌”.
 తవాఫ్‌ కోసం పరిశుద్ధత (తహారత్‌) మరియు వుజూ అవసరం. అలాగే ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు కాబా మీకు ఎడమ వైపు ఉండాలి. మొదటి ప్రదక్షిణలో భుజాలపైనున్న ఇహ్రాం గుడ్డ  నుండి కుడి భుజాన్ని తెరచి వుంచటం మంచిది. అలాగే మొదటి మూడు ప్రదక్షిణల్లో జోరుగా నడవడం అభిలషణీయం. ఏడు ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప, మఖామె ఇబ్రాహీం దగ్గర 2 రకాతుల నమాజ్‌ వీలైతే చెయ్యాలి. అలా కుదరని ఎడల మస్‌జిదె హరామ్‌లో ఎక్కడ చోటు లభిస్తే అక్కడ చేసుకోవాలి.
 మొదటి రకాతులో ”ఫాతిహా సూరా” తరువాత ”ఖుల్‌ యా అయ్యుహల్‌ కాఫిరూన్‌” రెండవ రకాతులో ”ఖుల్‌ హువల్లాహు అహద్‌” పారాయణం చెయ్యాలి.
 తరువాత జమ్‌జమ్‌ జలం త్రాగడం అభిలషణీయం. మళ్ళీ అక్కడి నుండి బయలు దేరి సఫా కొండ వద్దకు చేరుకోవాలి.
సయీ: ఇప్పుడు మీరు సఫా కొండను సమీపించారు. ఇప్పుడు ”ఇన్నస్సఫా వల్‌ మర్‌వత మిన్‌ షఆయిరిల్లాహ్‌ా….(బఖరా) ” అనే ఆయత్‌ పఠించాలి. తరువాత మెల్లగా కొండపై చేరుకోవాలి. కాబా వైపుకి తిరిగి ప్రవక్త (స) చదివిన ఈ దుఆని చదవాలి:
 ”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, లా షరీక లహూ, లహుల్‌ముల్కు, వలహుల్‌ హమ్దు, వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌. లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ, అన్‌జజ వఅదహూ, వ నసర అబ్దహూ, వ హజమల్‌ అహ్‌ాజాబ వహ్‌దహూ”.
 పై దుఆ మూడ సార్లు చదివిన తరువాత ఇష్టమైన దుఆ చెయ్యాలి. ఆ తరువాత సఫా నుండి సయీని ప్రారంభించి మర్వా వరకు, మర్వా నుండి సఫా వరకు 7 సార్లు సయీ చెయ్యాలి. పచ్చటి గుర్తు మధ్య పురుషులు మాత్రం వేగంగా నడవాలి. ఆ తరువాత బయటకెళ్ళి శిరోముండనం చేయించుకోవాలి. లేదా వెంట్రుకలను కత్తిరిం చుకోవాలి. స్త్రీలు శిరోముండనం చెయ్యకూడదు. వారు కొన్ని వెంట్రుకలు మాత్రమే కత్తిరిస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ ఉమ్రా పూర్తయింది.
 ఇప్పుడు మీరు ఇహ్రామ్‌ ఆంక్షల నుంచి ముక్తి పొందారు. ఇహ్రామ్‌ సందర్భాన నిషిద్ధమై ఉన్న ధర్మసమ్మతమైన కొన్ని కార్యాలు హలాల్‌ అవుతాయి.
గమనిక: ఇది హజ్జె తమత్తుకి సంబంధించిన ఉమ్రా మరియు సంవత్సరంలో ఎప్పుడైనా చేసే ఉమ్రా విధానం.  ఇక హజ్జె ఖిరాన్‌కి సంబంధించిన ఉమ్రా గురించి తెలుసుకుందాం. మీరు హజ్జె ఖిరాన్‌ చేసినట్లయితే మక్కా వెళ్ళగానే కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసిన తరువాత రెండు రకాతులు నమాజ్‌ చేసి, సఫా మర్వాల మధ్య సయీ చెయ్యాలి. కాని హజ్‌ పూర్తి అయ్యే వరకు శిరోముండనం చెయ్యకూడదు. హజ్జె ఇఫ్రాద్‌ అయితే తవాఫె ఖుదూమ్‌ తరువాత హజ్‌ సయీ చెయ్యవచ్చు. లేదా తవాఫె ఇఫాజ అనంతరం సయీ చేయవచ్చు. అంటే తవాఫే ఖుదూమ్‌ తరువాత హజ్‌ పూర్తయ్యేవరకూ ఇహ్రాంలోనే ఉంటారు.

హజ్‌ విధానం


1) హజ్‌ క్రియలు: జుల్‌హిజ్జ 8 వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజుని యౌముత్‌-తర్‌వియా అని కూడా అంటారు. ఈ రోజు హాజీలు స్నానం చేసి హజ్‌ దీక్ష బూనాలి. జుహర్‌ నమాజుకు ముందు మినా మైదానానికి బయలు దేరి వెళ్ళాలి. అక్కడ జొహర్‌, అసర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజులు విడివిడిగా వాటి సమయాలలో ఖసర్‌ చేసి చదవాలి. మినా మైదానంలో 9వ తేదీ రాత్రి గడిపి, ఫజ్ర్‌ నమాజ్‌ మినా మైదానంలోనే చేసి, సూర్యోదయం తరువాత అరఫాత్‌ మైదానం వైపు బయలు దేరాలి. మినా మైదానంలో రాత్రి బస చెయ్యడం ప్రవక్త (స) సంప్రదాయం.
2) అరఫాత్‌లో విడిది: అరఫాత్‌లో ‘నమిర’ అనే స్థలంలో దిగటం మంచిది. అలా కుదరకపోతే అరఫా మైదానంలో ఎక్కడైనా దిగవచ్చు. అరఫాలో ప్రవక్త (స) సంప్రదా యాన్ని అనుసరిస్తూ జుహ్ర్‌– -అస్ర్‌ నమాజులు ఒక అజాన్‌ రెండు ఇఖామత్‌లతో కలిపి ఖసర్‌ (రెండేసి రకాతుల చొప్పున) చేసి చదవాలి. నమాజ్‌ తరువాత అల్లాహ్‌ నామ స్మరణలో, అల్లాహ్‌ను వేడుకోవడంలో నిమగ్నమైపోవాలి. ప్రవక్త (స) ఈ రోజు ప్రత్యే కంగా ఈ దుఆ పఠించేవారు:
 ”లా ఇలాహ ఇల్లల్లాహు వహ్‌ాదహూ లా షరీక లాహూ, లహుల్‌ ముల్కు వ లహుల్‌ హమ్దు వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌”.
  ఇలా దుఆ చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ సూర్యాస్తమయం వరకు అరఫాలో వేచి ఉండాలి. సూర్యాస్తమయానికి ముందు బయలుదేరకూడదు. ఒకవేళ బయలు దేరినా తిరిగి మరలా అరఫా మైదానంలో చేరుకోవాలి. అలా తిరిగి రాని ఎడల అతని పై పరిహారం తప్పనిసరి అవుతుంది. అలాగే ఎవరైనా 9వ తేది అంటే అరఫా రోజున సూర్యాస్తమయానికి ముందే అరఫాత్‌ మైదానంలోకి ప్రవేశించకపోతే వారి హజ్‌ నెరవేరదు. వారు వచ్చే ఏడాది దాన్ని పూర్తి చెయ్యాలి.
3) ముజ్‌దలిఫా: హాజీ, ముజ్‌దలిఫా చేరుకోగానే ఒక అజాన్‌ రెండు ఇఖామత్‌లతో మగ్రిబ్‌ నమాజు పూర్తిగా ఇషా నమాజును ఖసర్‌ చేసి చదవాలి. తరువాత ముజ్‌దలిఫాలో రాత్రి బస చేయాలి. అర్థరాత్రి గడచిన పిదప బలహీనులైన స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వారి సేవ చేసేవారు ‘మినా’ వైపు వెళ్ళవచ్చు. కాని బలవంతులు మాత్రం రాత్రంగా అక్కడే గడిపి ఫజ్ర్‌ నమాజ్‌ చేసిన పిదప బాగా తెల్లారే వరకు దుఆ చేస్తూ ఉండాలి.
4) సూర్యోదయానికి ముందు మినా వైపు పయనించాలి. అర్ధరాత్రికి ముందు బలహీ నులైనా, బలవంతులైనా బయలు దేరకూడదు. ఎందుకంటే ముజ్‌దలిఫాలో రాత్రి గడపడం తప్పనిసరి.
5) పండగ రోజున అంటే జుల్‌ హిజ్జ 10వ తేదీన జరగవలసిన హజ్‌ క్రియలు:
అ) రమీ-కంకర్రాళ్ళు రువ్వడం.      ఆ) హదీ- ఖుర్బానీ.
ఇ) హల్ఖ్‌-శిరోముండనం.           ఈ) తవాఫ్‌, సయీ.
అ) రమీ: హాజీ ముజ్‌దలిఫా నుండి బయలుదేరి మినా వచ్చేటప్పుడు ముజ్‌దలిఫా నుండి లేదా దారిలో ఎక్కడనుండైనా చిన్న చిన్న 7 కంకర్రాళ్ళు తీసుకోవాలి. జమ్ర తుల్‌ ఉఖ్బా దగ్గరకు వెళ్ళి అక్కడ వున్న స్థంభానికి తగిలేటట్టు కంకర్రాళ్ళని విసరాలి. రమీ సమయం చంద్రమానం జిల్‌హిజ్జా 10వ తేదీ అర్థ రాత్రి నుండి మొదలై 10వ తేదీ సూర్యాస్తమయం వరకు ఉంటుంది. బలవంతులు సూర్యోదయం తరువాత రమీ చెయ్యటం ఉత్తమం.
ఆ) హదీ: ఖుర్బానీ పశువును తెచ్చుకున్న వారు జిబహ్‌ చెయ్యాలి. జిబహ్‌ సమయం 10వ తేది సూర్యుడు ఉదయించినప్పటి నుండి 13వ తేది సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అంటే పండుగ రోజు తరువాత మరో మూడు రోజులన్న మాట. హదీని స్వయంగా భుజించవచ్చు. ఇతరులకు బహుమానంగా ఇవ్వ వచ్చు. పేదలకూ పంచి పెట్ట వచ్చు. ముఫ్రిద్‌ (హజ్జె ఇఫ్రాద్‌ చేసే వ్యక్తి)కి ఖుర్బానీ లేదు. ఖిరాన్‌, తమత్తు హజ్‌ చేసే వారికే హదీ ఉంది.
ఇ) హలఖ్‌ – (శిరోముండనం లేదా జుత్తు కత్తిరించటం): ఖుర్బానీ తరువాత తల వెంట్రుకలను పూర్తిగా తీసి వెయ్యాలి. లేదా కత్తిరించాలి. స్త్రీలు మాత్రం కొన్ని శిరోజాలను కత్తిరిస్తే సరి పోతుంది. పండుగ రోజున హాజి, రమీ-హల్ఖ్‌ రెండూ పూర్తి చేశాక అతనికి – స్త్రీలు తప్ప ఇహ్రాం సందర్భాన ఉన్న నిషేధాలన్నీ తొలిగి పోతాయి. అంటే తన భార్యతో రమించకూడదు. ఆమె వైపు కామంతో నిండిన చూపు తవాఫే ఇఫాజ చేసేంత వరకూ చూడకూడదు.
ఈ) తవాఫ్‌-సయీ: అంటే హల్ఖ్‌ తరువాత మస్‌జిదే హరామ్‌ వైపు వీలైతే ఆ రోజే వెళ్ళాలి. వెళ్ళి తవాఫే ఇఫాజ చేయాలి. ముతమత్తి లేదా ముఖ్రిన్‌ అయితే సయీ కూడా చెయ్యాలి. ముఫ్రిద్‌ మాత్రం తవాఫే ఖుదూమ్‌ తరువాత సయీ చెయ్యని ఎడల ఇప్పుడు చెయ్యాలి. తవాఫ్‌ అన్నది ఈ రోజు అంటే 10వ తేది చెయ్యటం చాలా మంచిది. దీన్నే 13వ తేదీ వరకు ఆలస్యం కూడా చెయ్యవచ్చు. కాని అంతకు మించి ఆలస్యం చేయకూడదు.
10వ తేది చేసే పనులు ఒక చూపులో: 1) రమీ 2) జిబహ్‌ా 3) హల్ఖ్‌-తఖ్‌సీర్‌ 4) తవాఫె ఇఫాజ 5) సయీ.
గమనిక: వీటిలో ఏది ముంది ఏది వెనుకా అయినా పరవాలేదు. ఒక వేళ హదీ జంతువు లభించకపోతే అరఫా రోజు, పండుగ రోజు తప్ప హజ్‌లో మూడు రోజులు ఉపవాసం ఉండాలి. ఇంటికెళ్ళిన పిదప 7 ఉపవాసాలుండాలి. అంటే దీనికి పరిహారం 10 రోజుల ఉపవాసాలన్న మాట.
ఉ) అయ్యామే తష్రీఖ్‌ (తష్రీఖ్‌ రోజులు): జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలని అయ్యామె తష్రీఖ్‌ అంటారు. ఈ మూడు రోజులు హాజీలు రాత్రి ఎక్కువ సమయం మినాలో గడపాలి. ఇది వాజిబ్‌ (తప్పనిసరి). ఈ మూడు రోజుల్లో సూర్యుడు కాస్త పైకి ఎగ బ్రాకిన తరువాత రమీ చెయ్యాలి. 4 రకాతుల నమాజులని ఖస్ర్‌ చేసి విడివిడిగా ఆయా సమయాల్లోనే చదవాలి.
ఊ) రమీ విధానం: జవాల్‌ తరువాత ఎక్కడ నుండి అయినా సరే 21 కంకర రాళ్ళు తీసుకోవాలి. తరువాత జమ్రతుస్‌ సుగ్రా (చిన్న స్థంభం)ను సమీపించి 7 కంకరర్రాళ్ళ ను ఒక్కొక్కటిగా ‘అల్లాహు అక్బర్‌’ అంటూ ఎదుట వున్న స్థంభానికి తగిలేటట్లు విసరాలి. తరువాత కాబా వైపు ముఖం త్రిప్పి దుఆ చెయ్యాలి. తరువాత జమ్రతుల్‌ ఉస్తా దగ్గరకు రావాలి. ఇక్కడ కూడా 7 కంకరర్రాళ్ళను మొదట విసిరించినట్లే విస రాలి. తరువాత అక్కడా దుఆ చెయ్యాలి. ఆ తరువాత జమ్రతుల్‌ ఉఖ్బా దగ్గరకు వచ్చి అక్కడ కూడా 7 కంకర రాళ్ళు అల్లాహు అక్బర్‌ అంటూ రువ్వాలి. తరువాత దుఆ చెయ్యకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. 12 వ తేదీన కూడా అలాగే చెయ్యాలి. తరువాత వెళ్ళ దలచుకుంటే 12వ తేదీ సూర్యాస్తమయానకి ముందు బయలుదేరి పోవాలి. సూర్యుడు అస్తమించాడనుకోండి మళ్ళీ 13 తేది కూడా రమీ తప్పకుండా చెయ్యాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఆలస్యం చెయ్యడం తొందరగా వెళ్ళడంకన్నా మంచిది.
గమనిక: రమీ చెయ్యలేని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు తమ తరపున మరొకరికి ఆ బాధ్యత ను అప్పగించవచ్చు. ఎ) తవాఫుల్‌ విదా: హాజీ, మక్కా వదలి వెళ్ళే సంకల్పం చేసుకుంటే వీడ్కోలు ప్రదక్షిణ (తవాఫ్‌ విదా) చెయ్యకుండా వెళ్ళకూడదు. బహిష్టు స్త్రీకి తవాఫె విదా లేదు. (మరి ఎవరైతే తవాఫె ఇఫాజాని అలస్యం చేస్తాడో అతనికి తవాఫె విదాకి బదులు తవాఫె ఇఫాజ సరిపోతుంది).
ఫిదియా (పరిహారం)
అ) ఇహ్రామ్‌ నియమాలకు ఖచ్చితంగా కట్టుబడలేకపోయిన వ్యక్తి పరిహారంగా 3 రోజులు ఉపవాసాన్ని పాటించాలి. లేదా 6 మంది పేదలకి అన్నం పెట్టాలి లేక ఖుర్బానీ ఇవ్వాలి.
ఆ) ఉపవాసాలు ఎక్కడైనా ఉండవచ్చు. హరమ్‌లోనే ఉండాలన్న నిబంధన లేదు.
ఇ) హరమ్‌లో నివసించే పేదలకు అన్నం పెట్టడం మంచిది. హరమ్‌ బైట ఉన్న వారికి కూడా పెట్టవచ్చు.
ఈ) ఖుర్బానీ పశువుని హరమ్‌లో జిబహ్‌ా చెయ్యడం ఉత్తమం. పరిహారంగా జిబహ్‌ా చేసే జంతువు మాంసం స్వయంగా హాజీ తినకూడదు. ధనవంతులకు పెట్టకూడదు. ఇది కేవలం నిరుపేదల హక్కు.
ఉ) జుల్‌హిజ్జ 10వ తేదీ జమ్రతుల్‌ ఉఖ్బాలో రమీ మరియు శిరోముండనానికి ముందు ఎవరైనా తన భార్యతో రమిస్తే – 1) వారి హజ్‌ భంగమవుతుంది. 2) పరిహారంగా ఒక ఒంటెని లేదా ఆవుని జిబహ్‌ా చెయ్యాల్సి ఉంటుంది. 3) భంగమైన హజ్‌ని పూర్తి చెయ్యాలి. 4) వచ్చే సంవత్సరం ఈ హజ్‌కి బదులు మరలా హజ్‌ చెయ్యాలి. 5) అదే జమ్రతుల్‌ ఉఖ్బా రమీ మరియు హల్ఖ్‌ (శిరోముండనం)ల తరువాత తవాఫె ఇఫాజ (జియార)కి ముందు తన భార్యతో సంభోగిస్తే హజ్‌ భంగం కాదు. కాకపోతే ఒక మేకను పరిహారంగా జిబహ్‌ా చేయాల్సి ఉంటుంది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ‘ముహ్రిం నికాహ్‌ చెయ్యకూడదు. నికాహ్‌ా సందేశం పంపకూడదు’.  (ముస్లిం – అహ్మద్)

హజ్‌-ఉమ్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పారభాషిక పదాలు


ఇహ్రాం: ఉమ్రా లేక హజ్‌ లేదా రెండింటి కోసం ఒకేసారి దీక్ష బూనటం.
ఇహ్రాం దుస్తులు: దీక్ష సందర్భంగా ధరించే రెండు తెల్లటి దుప్పట్లు.
ముహ్రిం: మీఖాత్‌ చేరుకున్న పిదప హజ్‌ – లేదా ఉమ్రాకరొకు దీక్ష బూనిన వ్యక్తిని  ముహ్రింగా వ్యవహరిస్తారు.
హరమీ: స్వదేశి అయినా, పరదేశి అయినా హరంలో నివసించే వ్యక్తి.
హజ్‌ మాసాలు: 1) షవ్వాల్‌ 2) జుల్‌ ఖఅదా 3) జుల్‌హిజ్జ మాసపు మొదటి పది  రోజులు.
ఇస్తిలామ్‌: హజ్రె అస్వద్‌ (నల్లరాయి)ని ముద్దాడటం లేదా చెయ్యితో తాకటం, దూరం నుండి సైగ చెయ్యటం.
ఇజ్‌తిబా: ఇహ్రాం దుప్పటిని కుడి భుజం క్రింద నుండి తీసి ఎడమ భుజంపై వేసుకో వటం, అంటే కుడి భుజం తెరచివుంటే, ఎడమ భుజం కప్పబడి ఉండాలి.
తష్రీఖ్‌ దినాలు: జుల్‌హిజ్జ 11, 12, 13 తేదీలు.
తల్‌బియా: లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌………
తమత్తు: హజ్‌ నెలల్లో ఉమ్రా కొరకు ఇహ్రాం ధరించి, ఉమ్రా చేసి అదే సంవత్సరం  అదే ప్రయాణంలో హజ్‌ ఇహ్రాం కూడా బూని హజ్‌ చెయ్యటం.
ముతమత్తి: హజ్జె తమత్తుకై దీక్ష బూనిన వ్యక్తి.
ఖిరాన్‌: మీఖాత్‌ చేరిన పిదప ఉమ్రా-హజ్‌ల దీక్ష ఒకేసారి బూనటం. అంటే ఉమ్రా  చేసిన తరువాత అవే దుస్తుల మీద హజ్‌ నియమాలను నెరవేర్చటం.
ఖారిన్‌- ముఖ్రిన్‌: హజ్జె ఖిరాన్‌ దీక్ష బూనిన వ్యక్తి.
ఇఫ్రాద్‌: కేవలం హజ్‌ దీక్ష బూనటం. ఈ హజ్‌ చేసే వ్యక్తిని ముఫ్రిద్‌ అంటారు.
మీఖాత్‌: హజ్‌-ఉమ్రాల కోసం మక్కా వెళ్ళే వారు ఏ స్థలానికి చేరాక దీక్ష బూనటం  తప్పని సరో దాన్ని మిఖాత్‌ అంటారు.
సున్నత్‌: హజ్‌-ఉమ్రాలో ప్రవక్త (స) చేసిన పనులు. వీటిని పాటించడం పుణ్యప్రదం. వీటిని వదలడం అవాంఛనీయం.
తహ్లీఖ్‌- హల్ఖ్‌: ఉమ్రాలో తవాఫ్‌ మరియు సయీ తరువాత, హజ్‌లో ఖుర్బాని తరు వాత తలవెంట్రుకలను పూర్తిగా తీసివేయటం.
తఖ్సీర్‌: శిరోముండనానికి బదులు తలవెంట్రుకలను కత్తిరించటం.
దమ్‌: చెయ్యరాని పని చేసినందుకు ఖుర్బాని తప్పనిసరి అవటం.
రమీ: మూడు జమరాత్‌ల దగ్గర కంకర రాళ్ళు రువ్వటం.
రమల్‌: తవాఫ్‌ చేసేటప్పుడు మొదటి మూడు ప్రదక్షిణల్లో కాళ్ళు దగ్గరగా పెడుతూ భుజాలను ఎగురవేస్తూ జోరుగా నడవటం.
షౌత్‌: కాబా గృహ ఒక ప్రదక్షిణని హతీమ్‌తో కలిపి షౌత్‌ అంటారు.
తవాఫె ఖుదూమ్‌: మక్కా చేరుకున్న తరువాత చేసే మొదటి తవాఫ్‌. దీనినే తవాఫె    ఉరూద్‌ మరియు తవాఫె తహియ్యా అని కూడా అంటారు.
తవాఫె ఇఫాజా: జుల్‌హిజ్జ 10వ తేదీన చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె జియారహ్‌  మరియు తవాఫె రుకున్‌ అని కూడా అంటారు. సమయం 10వ తేదీ రమీ, ఖుర్బాని, హల్ఖ్‌ల తరువాత.
తవాఫె విదా: హరమ్‌ బయట నుండి వచ్చే హాజీలు మక్కా నుండి బయలుదేరక ముందు చేసే ప్రదక్షిణ. దీన్ని తవాఫె సద్ర్‌ అని కూడా అంటారు.
ఫిద్యా – (పరిహారం): చెయ్యరాని పని ఏదైనా చేస్తే ఫిదియా తప్పనిసరి. 3 రోజుల ఉపవాసాలుండాలి లేదా ఆరుగురు నిరుపేదలకు అన్నం   పెట్టాలి. లేదా మేకను జిబహ్‌ా చేసి పేదవారిలో పంచిపెట్టాలి.
సయీ: సఫా – మర్వా కొండల మధ్య ఏడుసార్లు తిరగటం (పచ్చని లైట్లు గల స్థలంలో చిన్నగా పరుగెత్తటం)

 హజ్‌ ఉమ్రాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన  పారభాషిక పదాలు

పవిత్ర మక్కా ప్రాశస్య్తం


1) ఈ స్థలంలోనే అల్లాహ్‌ ఆరాధనకై ప్రజలందరికోసం మొట్ట మొదటి దైవ గృహం నిర్మించబడింది. ప్రవక్త ఇబ్రాహీం (అ) ఇస్మాయీల్‌ (అ) లు తమ భుజాలపై ఈ ఇంటి రాళ్ళని మోసారు.
2) ఈ స్థలంలోనే దుష్టుడు అబ్రహ, అతని సైన్యం నాశనం చెయ్యబడింది.
3) ఈ స్థలంలోనే చరిత్రలో అతి పెద్ద సంఘటన జరిగింది. ప్రవక్త (స)పై వహీ ద్వారా దైవధర్మం పరిపూర్ణం చెయ్యబడింది.
4) ఈ స్థలం నుంచే ప్రవక్త (స)వారిని గగన యాత్రకి తీసుకెళ్ళడం జరిగింది. ఆకాశ వాసులు-భూవాసులతో, దూతలు-మానవులతో కలిసారు.
5) ఈ స్థలంలోనే జమ్‌జమ్‌ జలం పెల్లుబికింది. శతాబ్దాల తరబడి ప్రపంచమంతటికీ సరఫరా అవుతోంది.
6) ఈ స్థలంలోనే సత్యప్రియుడు, సత్యసంధుడు, సద్గుణ సంపన్నుడు, శుభకరుడు, సర్వలోక కారుణ్యమూర్తి అయిన అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) జన్మించారు.
7) ఈ స్థలంలోనే విశ్వాసులకు అతిపెద్ద విజయం లభించింది. చిల్లర దైవాలుగా పూజింపబడే శిలలను పగలగొట్టడం జరిగింది. అసత్యంపై సత్యం విజయ కేతనాన్ని ఎగుర వేసింది. హజ్రత్‌ బిలాల్‌ (ర) లాంటి నల్లని నిగ్రో కాబా గృహంపైకెక్కి అజాన్‌ ఇచ్చారు.
మక్కా మర్యాద: ఈ నగరం శాంతి నిలయం, మార్గదర్శక కేంద్రం. ఇందులో ప్రవే శించక ముందు స్నానం చెయ్యటం ప్రవక్త (స) సదాచారం. ఈ నగరంలో మంచి కార్యాల ప్రతిఫలం చాలా ఎక్కువ. అలాగే పాపాల శిక్ష కూడా చాలా కఠినమైనదే. కనుక ఇక్కడ ఉన్నన్ని రోజులు పుణ్యకార్యాలే చెయ్యాలి. పాపాలకి ఒడిగట్ట కూడదు. ఈ నగరాన్ని హరమ్‌ అని కూడా అంటారు. కనుక హరమ్‌ సరిహద్దుల్లో ఇహ్రాం ధరించిన వారైనా, ధరించని వారైనా వేటాడటం నిషిద్ధం. ఒకవేళ వేటాడి జిబహ్‌ చేసినా అది హలాల్‌ అవ్వదు. హరమ్‌ పరిసరాల్లో గల చెట్లను, గడ్డిని అనవసరంగా పెరక కూడదు. క్రింద పడి ఉన్న వస్తువుని మంచి ఉద్దేశ్యంతో తప్ప ముట్టుకోకూడదు.
కాబా పరదా
 కాబాపై పరదా వేసిన మొట్టమొదటి వ్యక్తి హజ్రత్‌ ఇస్మాయీల్‌ (అ). పూర్వం ముహర్రం 10వ తేదీన పరదా మార్చేవారు. మళ్ళీ ఖుర్భానీ చేసేరోజు మార్చనా రంభించారు. మళ్ళి జుల్‌ఖఅదలో మార్చేవారు. ప్రస్తుతం అరఫా రోజున మారుస్తు న్నారు. పూర్వం పరదా కాబా అర్ధ భాగానికే ఉండేది.
 మొదట తెల్లని సిల్కు పరదాని కప్పిన వారు మామూన్‌ రషీద్‌. పసుపు సిల్కు పరదాని కప్పినవాడు ముహమ్మద్‌ బిన్‌ సబక్తకీన్‌. పచ్చని సిల్కు పరదాని కప్పినవాడు నాసిరుల్‌ అబ్బాసి. తరువాత నల్లని పరదా కప్పడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రంగు పరదాను తొడిగిస్తున్నారు.
 ఇస్లాం సంపూర్ణమైన తరువాత ఈ పరదా ఈజిప్టులో తయారయ్యేది. ఇప్పుడు నల్ల రంగు పూసిన స్వచ్ఛమైన పట్టుతో తయారు చేయబడుతోంది. ఈ పరదాపై బంగారు తీగలతో ఖుర్‌ఆన్‌ ఆయతులు లిఖించ బడ్డాయి. ఈ పరదా ఎత్తు 14 మీటర్లు చుట్టు కొలత 47 మీటర్లు. 3 మీటర్ల క్రింద 95 సె.మి వెడల్పు గల పట్టిపై ఖుర్‌ఆన్‌ ఆయ తులు లిఖించ బడ్డాయి. కాబా తలుపులపై ఉన్న పరదా ఎత్తు 71/2 మీటర్లు. వెడల్పు 4 మీటర్లు దానిపై ఖుర్‌ఆన్‌ ఆయతులు బంగారు తీగలతో లిఖించబడ్డాయి. ఈ పరదా తయారు చెయ్యటానికి అయ్యే ఖర్చు 170 లక్షల సవూది రియాళ్ళు. అంటే భారత కరెన్సీలో సుమారు 22 కోట్లన్నమాట. ఈ పరదా తయారిలో సంవత్సరంపాటు 240 మంది కార్మికులు పని చేస్తారు. ఈ పరదా కోసం ప్రత్యేకంగా కిస్వతుల్‌ కాబా పేరుతో ఓ కంపెనీ మక్కాలోనే ఉంది. ఈ పరదా కొరకు ఉపయోగించే పట్టు 670 కిలోలు. ఈ పరదాలో ఉపయోగించే వెండి – బంగారు 120 కిలోలు.

హజ్‌ అంటే…

హజ్‌: ఇంటిని వదలడం, బంధుమిత్రులకు దూరమవడం, కృపాకరుడి దరికి చేరడం, మృత్యువును గుర్తు చేసుకోవడం, అనుగ్రహాలు వర్షంలా కురిసే శుభప్రదమైన ఇంటి వైపునకు పయనించడం.
హజ్‌: అక్కడికి షైతాన్‌ కూడా వస్తాడు. అతని సైన్యమూ ఉంటుంది. హద్దులు మీరే వారూ ఉంటారు. ప్రజలందరూ కలుస్తారు. ప్రతిజ్ఞ మళ్ళీ ధృవ పరచడం జరుగుతుంది ప్రతిజ్ఞకు సాక్ష్యమూ తీసుకోబడుతుంది.
ఇహ్రాం: అలంకరణను వదలటం, కఫన్‌ మాదిరి వస్త్రాన్ని ధరించడం, మృత్యువుకై సదా సిద్ధమవటం, బీదవారిలా కనిపించటం, ఏక దైవారాధనా భావాన్ని మరింత పటిష్టం చెయ్యటం, గుడ్డలే కాక మనసుని అన్ని మాలిన్యాల నుండి కాపాడుకోవటం,
సత్య సందేశాన్ని అందజేస్తామని సంకల్పించుకోవటం, కష్టాల్ని బాధల్ని కలసికట్టుగా ఎదుర్కోవటం, సత్కార్యాల్లో ఒండొకరికి చేయూత నివ్వటం.
తల్‌బియా: లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌, లబ్బైక్‌ లా షరీక లక లబ్బైక్‌, ఇన్నల్‌ హమ్ద వన్నిఅమత లక వల్‌ ముల్క్‌, లా షరీక లక. ఇది అల్లాహ్‌ా ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పే నినాదం. ఇది మంచిని పెంచే సూత్రం. చెడును నివారించే మహాస్త్రం. విన్నాము, విధేయులమయ్యాము, హాజరయ్యాము అన్న మాటకి నిర్వచనం.
తవాఫ్‌ : తవాఫ్‌ చేస్తూ జీవితం కూడా ఇలాగే ఆగని పయనం అని గుర్తించటం, అను గ్రహాలు ప్రసాదించమని కోరటం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము, అలసి పోయాము, మమ్మల్ని క్షమించు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవాన్ని కోరడం.
సయీ: ఆజ్ఞాపాలన, అమ్మ (హాజిరా) అడుగుజాడల్లో నడవటం, అల్లాహ్‌ ప్రసన్నతకై పరుగిడటం. సయీ అల్లాహ్‌కు దగ్గర చేస్తుంది. సత్పలితాన్ని ప్రసాదిస్తుంది. పుణ్యాన్ని పదింతలు చేస్తుంది. పాపాలని కడిగివేస్తుంది. స్వర్గపు హోదాలను పెంచుతుంది.
అరఫాలో విడిది: హష్ర్‌ మైదానాన్ని తలపించే సువిశాలమైన భూమి. స్పష్టంగా నీలాకాశం. అల్లాహ్‌ నామ స్మరణలో లీనమైన మనసు… రేపటి బహుమానం కోసం ఉబలాటం. కాలం చుట్టివేయబడింది. సమయం ఇమిడి పోయింది. చరిత్ర పునరావృ తమయింది. దాగినది బహిర్గతమయింది. ప్రపంచం నోరు మూసుకుంది. సప్తలోకాలు తదేకంగా ఈ దృశ్యాన్ని తిలకిస్తున్నాయి. సత్యం వచ్చేసింది. అసత్యం నిష్క్రమించింది. అజ్ఞానం తొక్కివేయబడింది. అపమార్గాలు మూసి వేయబడ్డాయి.
 రమీ: అసత్యాన్ని విసిరివేయటం! అసత్యాన్ని తరిమి కొట్టడం! పాశవిక ప్రవృత్తిని వదలివేస్తానని ప్రతిన బూనటం! ఏమీ లేక పోయినా ఈ చిన్న చిన్న కంకర రాళ్ళతో దుష్ట శక్తులపై పోరాడుతానని ప్రతిజ్ఞచెయ్యటం! స్వార్థపరుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దాగి ఉన్న దొంగలనీ అంతం చేసే వరకూ నిద్రపోనని వాగ్దానం చెయ్యటం!
హల్ఖ్‌:   పాపాలని వదలి వేస్తున్నానని తప్పులతో నిండిన శరీరాన్ని శుద్ధ పరచుకుం టాననీ, ఎలాగైతే తల వెంట్రుకల్ని తీసేసానో అలాగే తన జీవితంలో ఉన్న లోపాల్ని దూరం చేసుకుంటాననీ, అవసరమైతే తలనే పణంగా పెట్టగలనని సంకేతం ఇవ్వటం.
నహ్ర్‌: త్యాగధనుడు హజ్రత్‌ ఇబ్రాహీం (అ)కు అనుసరణగా, చెడు మనస్తత్వానికి వ్యతి రేకంగా, తండ్రి ఆజ్ఞాపాలనకు గుర్తుగా, కొడుకు ఇస్మాయీల్‌ (అ) వినయానికి ప్రతీకగా ఇచ్చే ఖుర్బానీ.

త్యాగం లేకుండా ఏ ఆశయమూ సిద్ధించదు


త్యాగం సామాజిక జీవనానికి జీవనాడి. సమాజం సజావుగా సాగాలంటే సభ్యుల్లో త్యాగశీలం అనివార్యం.
త్యాగం – తనువులో చూపాలి. మనసులో చూపాలి. ధనంలో చూపాలి. సమయంలో చూపాలి. శక్తిలో చూపాలి. త్యాగం తన కోసం చెయ్యాలి. తనవారి కోసం చేయాలి. పరాయి వారి కోసమూ చెయ్యాలి. త్యాగం – ఆశయాల కోసం చెయ్యాలి. ఆదర్శాల కోసం చెయ్యాలి. తత్సమయ లక్ష్యాల కోసం చెయ్యాలి. చిరకాల సాఫల్యాల కోసం చెయ్యాలి. తాత్కాలిక గమ్యాల కోసం, శాశ్వత మార్గాల కోసం – జీవితమంతా త్యాగాల తోరణాలు నిండితే అందులో పండు వెన్నెల పండుతుంది. గుండెనిండా నెమ్మది నిండుతుంది. అందుకే సమాజం త్యాగాలను కోరుతుంది.
త్యాగం లేనిదే సమాజంలో అనురాగమూ లేదు, అనురక్తీ లేదు. మనుగడలో మమతలు పెరగాలంటే ప్రతి వ్యక్తీ ఎదుటివారి కోసం ఏదో ఒకటి త్యాగం చెయ్యవలసి వస్తుంది – కోరికల్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది. కాంక్షల్నీ త్యజించవలసి వస్తుంది. మనసయిన మార్గాలనూ వదులు కోవలసి వస్తుంది. త్యాగం లేనిదే ఏ ఆశయమూ సిద్ధించదు. ఆశయం ఎంత ఉన్నతమైనదో త్యాగాలూ అంతే విస్తృతమయి ఉంటాయి. ఆశయం ఎంత పవిత్రమయిందో త్యాగాలు అంతే నిష్ఠను, చిత్తశుద్ధిని కోరుతాయి.
ముస్లింల జీవితాశయం – ఒక్క మాటలో చెప్పాలంటే – భూమిలో విభుని మాటే చెల్లాలి అన్నది. దాని వివరణః మనిషి తన వ్యక్తిగత జీవితంలోనూ అడుగడుగునా, క్షణక్షణాన సృష్టికర్త ఆదేశాలనే పాటించాలి. అతని సామూహిక జీవితంలోనూ అన్ని రంగాల్లోనూ ఎల్లెడలా ఆ పరమ ప్రభువు ఇచ్ఛే నెరవేరాలి. ఈ ఆశయానికి ప్రతి ముస్లిం వ్యక్త్తిగతంగానూ, ముస్లింల సమాజం సామూహి కంగానూ బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే విశ్వ ప్రభువు అభీష్టం ఏమిటి? చెడు సమసిపోవాలి. మంచి పరిఢవిల్లాలి! వ్యక్తిలోనూ, సమాజంలోనూ!!
ఈ ఆశయసిద్ధి కోసమే ముస్లిం జీవితమంతా కృషి చేస్తుంటాడు. పోరాడుతుంటాడు. అతని పోరాటం దుష్ట శక్తులతో, మిథ్యావాదాలతో, వినాశకర దృక్పథాలతో నిరంతరం సాగుతూ ఉంటుంది.
ఈ సంఘర్షణకు, చెడుతో జరిగే ఈ పోరాటానికి సమాయత్త పరచడానికి ఉద్దేశించబడినవే – ఇస్లాం ప్రతి పాదించే సకల ఆరాధనలు సకల ఉపాసనా రీతులు, నైతిక వ్యవస్థ, సామాజిక విధానం, రాజకీయ సిద్ధాంతం – ఇస్లామీయ జీవన వ్యవస్థ అంతా ఈ తర్ఫీదుకు దోహదపడేదే.
ఆ తర్ఫీదు, సుశిక్షణల అంతర్భాగమే ”హజ్జ్‌” యాత్ర కూడా. అందులో మనిషి ఆంతర్యంలో ఉద్భవించే కాంక్షల్ని, వాంఛల్ని మాత్రమే కాక సకల దౌర్బల్యాలను జయించాలని హజ్‌ శిక్షణ ఇస్తుంది. శిక్షణలో అంతర్భాగంగానే మనిషి మోహావేశాలన్నింటికీ, రుచులన్నింటికీ దూరం కావాలని నిర్దేశిస్తుంది దైవాదేశం:
”హజ్‌ నెలలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాల్లో హజ్‌ సంకల్పం చేెసుకున్న వ్యక్తి అప్రమత్తుడయి మెలగాలి. హజ్‌ కాలంలో అతను ఏ విధమయిన కామ చేష్టకు, పాపపు పనికి, పోట్లాటకు పాల్పడకుండా జాగ్రత్త పడాలి. మీరు చేసే సత్కార్యం ఏదయినా అది అల్లాహ్‌కు తెలుస్తుంది. హజ్‌ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకు మరీ బయలుదేరండి. అన్నింటికంటే ఉత్తమమయిన ప్రయాణ సామగ్రి నిష్ఠాగరిష్ఠత. కాబట్టి వివేచనాపరులారా, నా పట్ల అవిధేయత నుండి తప్పుకు మెలగండి”. (2: 197)

ఆలస్యం అమృతం విషం


”ప్రప్రథమంగా మానవుల కొరకు నిర్మించబడిన ఆరాధనా గృహం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకల శుభాలు ప్రసాదించబడ్డాయి. విశ్వ ప్రజలందరికి అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఇబ్రాహీం యొక్క ప్రార్థనా స్థలం ఉన్నది. దానిలో ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. ప్రజలవై అల్లాహ్‌ాకు ఉన్న హక్కు ఏమిటంటే, ఈ గృహానికి వెళ్ళే శక్తిగలవారు దాని హజ్‌ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్క రించేవాడు అల్లాహ్‌ాకు ప్రపంచ ప్రజల అవసరం ఎంత మాత్రం లేదు అని స్పష్టంగా తెలుసుకోవాలి.” (ఆలి ఇమ్రాన్: 96,97)
ఆయతులో పరిశుద్ధుడైన అల్లాహ్‌ కాబా గృహాన్ని మానవులందరి కొరకు ఆరాధనా కేంద్రంగా నిర్మించబడిన ఏకైక గృహమని పేర్కొన్నాడు. ఈ గృహం ప్రపంచంలోని 150 దేశాలలో నివసించే ముస్లింల పుణ్యక్షేత్రం. ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల మంది ముస్లింలకు 15 రోజులుగా ఆతిథ్యాన్నిచ్చే అపురూప నెలవు.
”ఈ గృహం లాంటి ఒక గృహం ‘బైతుల్‌ మామూర్‌’ – అది ఏడు ఆకాశాలవైన దైవ దూతలకు ఆరాధనా కేంద్రంగా ఉంది. ప్రతిరోజు 70 వేల మంది దూతలు ఆ గృహం చుట్టు ప్రదక్షిణ చేస్తూంటారు. ఒకసారి ప్రదక్షిణాభాగ్యం పొందిన దైవదూతకు మరొక సారి ప్రదక్షిణ చేసే అవకాశం ప్రళయం వరకూ లభించదు” అని స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పి ఉన్నారు. (బుఖారీ, ముస్లిం)
దాని స్థానే భూమివై ఒక ఆరాధనా కేంద్రాన్ని విశ్వ జనుల కొరకు నిర్మించమని అల్లాహ్‌ సుబ్‌హానహు వ తఆలా తన విధేయుడైన ఇబ్రాహీం (అ)కు ఆజ్ఞావించాడు. ఇబ్రాహిం (అ), అల్లాహ్‌ ఆజ్ఞ మరియు దూత జిబ్రయీల్‌ గారి సూచనాను సారం తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ)తో కలిసి కాబా గృహన్ని భక్తీప్రపత్తులతో నిర్మించి, దానికి ఎల్లలను సూచిం చారు. కాబా నిర్మాణానంతరం ”వ అజ్జిన్‌ వ¦ిన్నాసి బిల్‌హజ్జ్‌” అన్న ప్రభువాజ్ఞ ప్రకారం ప్రజలకు కాబా గృహంవైపు హజ్‌ కొరకు రమ్మని విలుపునిచ్చిన ప్రథమ ప్రవక్త ఇబ్రాహీం (అ). ఈ గృహ విశిష్ఠత గురించి ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా తెలియపరచారు:
”హజ్‌ ఉమ్రాకు వెళ్ళేవారు దేవుని ముఖ్య అతిథులు, వారు అల్లాహ్‌ను వేడుకుంటే అల్లాహ్‌ వారి మొరలను స్వీకరిస్తాడు, క్షమాభిక్షను అర్థిస్తే క్షమిస్తాడు. చిత్తశుద్ధితో చేసిన హజ్‌కు ప్రతిఫలం స్వర్గంకంటే తక్కువ కాజాలదు. మనో వాంఛలకు, చెడు పనులకు దూరంగా ఉంటూ దైవప్రసన్నత కోసం హజ్‌ చేసిన వ్యక్తి, ఆ రోజే తల్లి గర్భం నుంచి పుట్టిన శిశువు వలె అత్యంత పునీతుడయి తిరిగి వస్తాడు. మస్జిదె హరామ్‌లో చేసే ఒక నమాజుకు ఇతర మస్జిద్‌లలో చేసే లక్ష నమాజుల పుణ్యం ప్రసాదించబడుతుంది” అని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మరికొన్ని ప్రవచనాల ద్వారా రూఢీ అవుతుంది.
ఇవేకాకుండా ప్రాపంచిక శుభాలు కూడా ఎన్నో ప్రాప్తమవుతాయి. వాటిలో సర్వ శ్రేష్ఠమైనది విశ్వ మానవ విశ్వాస బాంధవ్యం. ప్రపంచ దేశాల్లోని ముస్లిముల వేష భాషలు, అలవాట్లు వేరైనా, 15 రోజుల పాటు సకల ఉపాసనారీతులు ఎలాంటి విభేదం లేకుండా కలిసిమెలిసి పాటిస్తారు. వారందరి ధ్యేయం ఒక్కటే అయి ఉంటుంది. అల్లాహ్‌ా ప్రసన్నత, పరలోక సాఫల్యం, క్షమాభిక్ష.
అక్కడ వాగ్వివాదాలకు తావు లేదు. పోట్లాటలకు ఆస్కారం ఉండదు. అందరి అధరాలపై కదలాడే సంకీర్తనం ఒకటే- ”హాజరయ్యాను ఓ అల్లాహ్‌ా నేను హాజరయ్యాను, సాటి లేని స్వామీ నేను హాజరయ్యాను. నిస్సందేహంగా సకల స్తోత్రాలు నీకే. సకల వరాలు అనుగ్రహించినదీ నీవే. సార్వభౌమత్వమూ నీదే. నీకు సమానులు, సహవర్తులు ఎవ్వరూ లేరు.”
అక్కడకు చేరిన ప్రతి ప్రాణికి రక్షణ ఉంది. రాజైనా, పేదయినా సమయానికి అల్లాహు అక్బర్‌ అన్న విలుపుకు సమానంగా స్పందించి, ప్రతిష్ఠాలయానికి తరలి వచ్చి, కలిసి మరీ నమాజు చేస్తారు. అలాంటి శుభ వాతావరణంలో ఒక్క రోజు జీవించినా వారి జన్మ ధన్యమే.


    ఈ గృహంలోని స్పష్టమైన సూచనలు అనగా, ఇబ్రాహీమ్‌ (అ) జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క ఘట్టానికి ప్రతిరూపంగా ఉన్న అక్కడి ‘మషాయిర్‌’. మనిషి జాడ కానరాని ఎడారిలో అల్లాహ్‌ ఆరాధనకై ఇబ్రాహీం (అ) నిలబడి కాబా గృహాన్ని నిర్మించిన ఆ స్థలమే మఖామె ఇబ్రాహీమ్‌. జీవిత సౌకర్యాలూ, జన సంచారం లేని ప్రదేశంలో తన ఏకైక పుత్రునితో, భర్త విధేయత, మరియు అల్లాహ్‌ా ఆజ్ఞాపాలనకై అక్కడ జీవించ డానికి సిద్ధపడిన ఒక విశ్వాసురాలి నిరుపమాన విశ్వాసానికి, ధైర్యానికి, ఆత్మ స్థయిర్యానికి నిదర్శనం జమ్‌ జమ్‌ జల నిధి, సఫా మర్వాల సయీ. హష్ర్‌ మైదానాన్ని, లెక్కల ఘడియని తలపించే అరఫాత్‌ మైదానం, మినా, ముజ్దలిఫాలు – ఇవన్నీ కాలచక్రంలో నాలుగు వేల సంవత్సరాలుగా తమ పూర్వ వైభవంతో అలరారుతూ వస్తున్న హజ్‌ ‘చిహ్నాలు’.
    అందుకే – ఆరోగ్య, ఆర్థిక స్తోమత కలిగి ఉన్న ప్రతి ముస్లిం తప్పనిసరిగా హజ్‌ చేయాలనీ, చేయక తిరస్కరించిన వారికి- అల్లాహ్‌కు మధ్య ఏ సంబంధం ఉండదని హెచ్చరించాడు అల్లాహ్‌.
    ప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా అన్నారు: ”వీలైనంత త్వరగా హజ్‌ చేసుకోండి. ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. తాను హజ్‌ చేయాలి అని అనుకునే వ్యక్తి దాని కోసం తొందరపడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారినయినా పడవచ్చు లేదా తన వాహనాన్ని అయినా పోగొట్టు కోవచ్చు. లేదా ఇంకా ఏదయినా ఆటంకం ఏర్పడవచ్చు.”

    త్యాగమూర్తి ప్రవక్త ఇబ్రాహీమ్‌


    ఇబ్రాహీమ్‌ (అ) దుఃఖం
    తన కుటుంబాన్ని మదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీమ్‌ (అ)కు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లాహ్‌ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదలి వెళుతున్న ఆలోచన కూడా భరించ రానిదిగా ఉందాయనకు. అయితే విశ్వ ప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్‌ను ప్రార్థిస్తూ, ”ఓ ప్రభూ! నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదలి వచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి కావలసిన సదుపాయాలు ప్రసా దించు” అని వేడుకున్నారు.
    దేవునిపై భారం వేసిన హాజిరాకు విశ్వ ప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదిం చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసి బిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరుమున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేల మీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకాడుతూ తిరగ సాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తు న్నారు). ఆ కొండపై నుంచి ఆ లోయల మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండగా పిలుస్తున్నారు). ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కన బడుతుందన్న ఆశతో ఆ కొండపైకెక్కారు. కాని ఏమీ కనబడలేదు. ఆమె ఆందో ళనతో మళ్ళీ మొదటి కొండపైకెక్కారు. ఆ విధంగా ఆమె నీటి కోసం వెదుకాడుతూ ఆ రెండు కొండల మధ్య ఏడుసార్లు పరు గులు తీశారు. (హజ్‌ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య ఏడుసార్లు పరుగెత్తుతూ చేసే ‘సయీ’ ఈ సంఘటన జ్ఞాపకార్థమే.)
    జమ్‌జమ్‌
    ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ”ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది.
    బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొన ఊపిరితో పెనుగులాడ డాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టు కుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయీల్‌ తన చిన్నారి కాళ్ళతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేక పోయారు.
    అల్లాహ్‌ా పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీమ్‌ (అ) కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపిం చాడు. హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. ఆ నీటతో బిడ్డ ప్రాణాలు కుదుట పడటాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్ళతో ఆమె అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే ”జమ్‌ జమ్‌” జలంగా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్స రాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్‌ యాత్రీకులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జమ్‌జమ్‌ జలమే.
    మరిన్ని చిహ్నాలు
    దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్‌ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ ”జుర్‌హుమ్‌” (యెమన్‌ వాసులు నిజమైన అరబ్బులు అనబడుతారు. వారు మాట్లాడే అరబీ భాష చాలా ప్రామాణికమైనది.) దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనిం చారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతో షించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్‌ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో అల్లాహ్‌ వారి పట్ల సాను భూతిని జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్‌ (అ) చేసిన ప్రార్థన ను దేవుడు ఆమోదించాడు.
    ఆ ప్రదేశంలో జమ్‌జమ్‌ నీటి ఊట బయటపడినందువల్ల యెమన్‌ నుంచి అక్కడకు వచ్చిన జుర్‌హుమ్‌ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవ డానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతిం చారు. వారిని అతిథులుగా గౌరవిం చారు. వారిలో కొందరు తమ కుటుం బాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం (మక్కా)నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.
    ఇబ్రాహీమ్‌ (అ) అభిలాష
    నిర్మానుష్య ప్రదేశంలో తాను వదలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీమ్‌ (అ) ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్ద వాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు అర్పించే వారు. తన కుటుంబానికి నిలువ నీడ కల్పించి, వారికి కావలసిన అన్నపానీ యాలు ఏర్పాటు చేసిన అల్లాహ్‌కు ధన్య వాదాలు తెలుపుకునేవారు.
    నిరుపమానమైన త్యాగం
    ఇబ్రాహీమ్‌ (అ) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల నిబద్ధతను, చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్‌ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నిం చరు. అల్లాహ్‌ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగా ఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్‌ (అ) చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మరోసారి ఇబ్రాహీమ్‌ (అ)ను కఠినమైన పరీక్షకు గురి చేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్‌ (అ) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్‌ కోసం జిబహ్‌ చేయాలని ఆదేశించడం జరిగింది.
    (బైబిల్‌లో కూడా ఈ ప్రస్తావన ఉమది. అబ్రహంకు అతని ఏకైక పుత్రుడు, ఇస్సాక్‌ను బలి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని. కాని ఇస్సాక్‌ ఆయన ప్రథమ పుత్రుడు కాదు. ఇస్మాయీల్‌ (అ) ఆయన జేష్ఠ పుత్రుడు. అంటే ఈ ఆదేశం అందిన సమయంలో ఆయనకు ఉన్న ఏకైక పుత్రుడు ఇస్మాయీల్‌ (అ) మాత్రమే. ఇస్సాక్‌ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు జన్మించారు. ఇస్మాయీల్‌ (ఆ అరబ్బు తెగల్లో కలిశారు. ఆయన సంతానంలో ప్రవక్త అరబీ (స) జన్మించారు. కాగా ఇస్సాక్‌ సంతానంలో ఇతర ప్రవక్తలు జన్మించారు. అందువల్లనే అరబ్బులు, ఇస్రాయీల్‌ (ప్రవక్త యాకూబ్‌ (అ)గారి) సంతానం సోదరులని చెప్పడం జరుగు తుంది.)
    ఆత్మ విశ్వాసంతో ఇబ్రాహీమ్‌ (అ) మక్కాకు బయలు దేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్‌ (అ) కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. ”నాన్నా! మీకు ఆజ్ఞా పించబడినట్లు చేెయండి. అల్లాహ్‌ా కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాము చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికివ్వాలని చెప్పారు. తాను కాళ్ళు చేతులు కొట్టు కోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు. ఇబ్రాహీమ్‌ (అ) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్‌ (అ)కు మృత్యు బాధ లేకుండా ఉండాలని భావిం చారు.
    కుమారుడిని గట్టిగా కౌగలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్‌ (అ)ను పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్‌ (అ) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీమ్‌ (అ)అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్‌ాను వేడుకున్నారు. అల్లాహ్‌ా ఆయన వేడుకోలుకు బదులిచ్చాడు. ”ఇబ్రాహీమ్‌ (అ)! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహు మానం ప్రసాదిస్తున్నాము” అన్నాడు. ఆ తండ్రీకొడుకులు దేవుని ఆదేశం శిరసా వహిండానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్‌ాకు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు దేవుని కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు బదులుగా జిబహ్‌ా చెయ్యడానికి ఆ దగ్గరలోనే ఒక పెద్ద పొట్టేలు కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ పొట్టేలు గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్‌ అజ్హా (ఖుర్బానీ పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.
    ద్వార బంధాన్ని మార్చడం
    ఇస్మాయీల్‌ (అ) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్‌హుమ్‌ తెగవారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చు కున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా బినందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్‌ (అ)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణిం చిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.
    ఇబ్రాహీమ్‌ (అ) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్‌ (అ) ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండటంతో ఆమెతో ఇబ్రాహీమ్‌ (అ) మాట్లాడారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవీ వినకుండా తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీద స్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడగలేదు. కనీసం మంచి నీరన్నా అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీమ్‌ (అ) ఆమెలో చూశారు. అల్లాహ్‌ా అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, ”నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.
    ఇస్మాయీల్‌ (అ) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలాఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తి ఆకారాన్ని వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాదు, గాయాలు కూడా అవుతాయనీ, అదే విధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు.
    కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ణి చూడటానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్‌ (అ) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది. భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి, ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాల కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది.
    ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తు న్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లా డింది. ఇబ్రాహీమ్‌ (అ) చాలా సంతోషిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనదీ ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. (ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెను ఆశ్చర్య పరచాలని భావించారు.) అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. ”నీ భర్త వచ్చిన తర్వాత నా సలాము చెప్పు. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పు” అని వెళ్ళిపోయారు.
    ఇస్మాయీల్‌ (అ) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్‌ (అ) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలిసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్‌ (అ) జీవితాంతం ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సజ్జన సంతానం కలిగింది.
    కాబా నిర్మాణం
    ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ని చూసి చాలా కాలమయ్యింది. ఈసారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని పునర్నిర్మించ వలసిందిగా అల్లాహ్‌ా ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీమ్‌ (అ) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్‌జమ్‌ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ) బాణాలకు పదును పెడుతుండ టాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అమితంగా సంతోషిం చారు. తండ్రీకొడుకులు ఆనందంతో కౌగిలించుకున్నారు. అల్లాహ్‌ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీమ్‌ (అ) కుమారునికి తెలియజేశారు. ఇస్మాయీల్‌ (అ) ఎల్లప్పుడూ తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.
    ”ఓ ప్రభూ! మా యిద్దర్ని ముస్లింలుగా జేయి. మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అనంత కరుణామయుడివి”. (బఖరా:127,128)
    ఇస్మాయీల్‌ (అ) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్‌ (అ) వాటిని అమర్చ సాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపు రేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్‌ (అ)ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్‌ (అ)తో ఏదైనా మంచి రాయి, తాను నిలబడటానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్‌ (అ) ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. (ఈ రాయి వేలాది సంవత్స రాలుగా పరిరక్షించబడుతున్నది. నేడు ‘మఖామె ఇబ్రాహీమ్‌’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.) ఆ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించ బడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్త ముస్లింలకు (దైవ విధేయులకు) పవిత్ర గృహంగా అలరారుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్‌ పట్ల తమ కృతజ్ఞతలను ముస్లింలు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు.
    గ్రహించవలసిన పాఠాలు
    ఇబ్రాహీమ్‌ (అ)ను ప్రవక్తల పితామహునిగా పేర్కొనడం జరిగింది. సమాజంలో షిర్క్‌ (బహుదైవారాధన)ను దురాచా రాలను తుదముట్టించడానికి ఆయన నిరంతరం శ్రమించారు.
    ఇబ్రాహీమ్‌ (అ) తండ్రి అల్లాహ్‌ సందేశాన్ని తిరస్కరించి నప్పుడు ఆయన తన తండ్రిని నిందించలేదు. ఆయన సాఫల్యం కొరకు ప్రార్థించారు. ఆయనను సత్యసందేశం స్వీకరించేలా మార్చాలని ఆశించారు. తండ్రి పట్ల ఆయన గౌరవాదరణలతో వ్యవహరించారు. ఆయన పట్ల గౌరవమర్యాదల్లో లోటు చేయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) అల్లాహ్‌ పట్ల పూర్తి విశ్వాసం కలిగి నవారు. ఎలాంటి త్యాగానికైనా వెనుదీయని వ్యక్తిత్వం ఆయనది. విశ్వప్రభువైన అల్లాహ్‌ ఆయన్ను ”ఖలీలుల్లాహ్‌” (అల్లాహ్‌ మిత్రుడు)గా అభివర్ణించాడు.
    విగ్రహారాధకులను ఎదుర్కొన్నప్పుడు ఆయన అనితర సాధ్యమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు అత్యంత పవిత్రంగా భావిస్తున్న అంశాల్లోని ఔచిత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించారు. మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేెనప్పుడు ఆయన తన నిరసనను చేతల్లో చూపించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. అందువల్ల ఆయన్ను అగ్ని గుండంలోకి విసిరివేయడం జరిగింది. కాని అల్లాహ్‌ా పట్ల ఆయనకున్న చెక్కుచెదరని విశ్వాసం ఆయన్ను కాపాడింది.
    ఆయన భార్యలు సారా, హాజిరా ఇద్దరూ సౌశీల్యవతులు, ఆయన పట్ల పూర్తి విధేయత కలిగినవారు. సహనంతో వ్యవహరిస్తూ గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. అందుగ్గాను అల్లాహ్‌ వారికి అనేక విధాల బహూకరించాడు.
    హాజిరా పట్ల, హాజిరా కుమారుని పట్ల ఇబ్రాహీమ్‌ (అ) గారి శ్రద్ధ చూసి సారా అసూయపడటం మానవ సహజమైన ప్రతిక్రియగా అర్థం చేసుకోవాలి.
    ఇబ్రాహీమ్‌ (అ) కుమారుడు ఇస్మాయీల్‌ (అ) తండ్రికి తగిన తనయుడు. తనకు తాను ప్రాణ త్యాగానికి సిద్ధమై అల్లాహ్‌ సంతుష్టిని పొందారాయన.
    అల్లాహ్‌కు మానవ బలి అవసరం లేదు. అల్లాహ్‌ కోసం కన్నకొడుకును జిబహ్‌ చేయడానికి సిద్ధపడడాన్ని, అల్లాహ్‌ సేవ కోసం కన్న కుమారుడిని అంకితం చేయడంగా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలం.
    వారు నిర్మించిన కాబా గృహం దేవుని ఏకత్వానికి చిహ్నంగా గత 4000 ఏళ్ళ సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

    త్యాగమూర్తి ప్రవక్త ఇబ్రాహీమ్‌
    ఇబ్రాహీమ్‌ (అ) దుఃఖం తన కుటుంబాన్ని మదలి ఒక్కో అడుగు దూరంగా వెళుతున్న కొద్దీ ఇబ్రాహీమ్‌ (అ)కు దుఃఖం అతిశయించసాగింది. ముసలి వయసులో తనకు అల్లాహ్‌ ప్రసాదించిన ఏకైక కుమారుడిని అక్కడ వదలి వెళుతున్న ఆలోచన కూడా భరించ రానిదిగా ఉందాయనకు. అయితే విశ్వ ప్రభువు పట్ల దృఢమైన తన నిబద్ధతను నిరూపించుకునే పరీక్షల్లో ఇదొకటని ఆయన గుర్తించారు. ఆయన అల్లాహ్‌ను ప్రార్థిస్తూ, ”ఓ ప్రభూ! నీ పవిత్రమైన గృహానికి దగ్గరగా నిర్జన ప్రదేశంలో నేను నా కుటుంబీకులను వదలి వచ్చాను. వారు అక్కడ దైవారాధనను స్థాపించాలని భావిస్తున్నాను. వారి పట్ల సానుభూతి, ఆదరాభిమానాలను ప్రజల్లో కలిగించు. వారికి కావలసిన సదుపాయాలు ప్రసా దించు” అని వేడుకున్నారు.
    దేవునిపై భారం వేసిన హాజిరాకు విశ్వ ప్రభువు సహనాన్ని, ధైర్యాన్ని ప్రసాదిం చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత వారి వద్ద ఉన్న ఆహారం, నీరు అయిపోయాయి. పసి బిడ్డతో సహా ఆమె ఆకలిదప్పులతో అలమటించసాగారు. బిడ్డకు పాలు పట్టడానికి ఆమె రొమ్ముల్లో పాలు కూడా రావడం లేదు. పసిబిడ్డ ఆకలితో దయనీయంగా ఏడుస్తున్నాడు. హాజిరా కన్నీరుమున్నీరయ్యింది. బిడ్డను అక్కడే నేల మీద వదలి నీటి కోసం, ఆహారం కోసం వెతుకాడుతూ తిరగ సాగారు. ఒక కొండను ఎక్కారు (ఈ కొండనే తర్వాత సఫా కొండగా పిలుస్తు న్నారు). ఆ కొండపై నుంచి ఆ లోయల మొత్తాన్ని పరిశీలించి చూశారు. మరో వైపున ఇంకో కొండ కనబడింది (దీనిని తర్వాత మర్వా కొండగా పిలుస్తున్నారు). ఆ కొండపై నుంచి చూస్తూ నీటి జాడ కన బడుతుందన్న ఆశతో ఆ కొండపైకెక్కారు. కాని ఏమీ కనబడలేదు. ఆమె ఆందో ళనతో మళ్ళీ మొదటి కొండపైకెక్కారు. ఆ విధంగా ఆమె నీటి కోసం వెదుకాడుతూ ఆ రెండు కొండల మధ్య ఏడుసార్లు పరు గులు తీశారు. (హజ్‌ యాత్ర సందర్భంగా సఫా మర్వా కొండల మధ్య ఏడుసార్లు పరుగెత్తుతూ చేసే ‘సయీ’ ఈ సంఘటన జ్ఞాపకార్థమే.)
    జమ్‌జమ్‌
    ఆమె నిరాశగా పసిబిడ్డ వద్దకు వచ్చారు. బిడ్డ పరిస్థితి దయనీయంగా ఉంది. ”ఓ ప్రభూ! కరుణించు” అంటూ మొర పెట్టుకున్నారు. బిడ్డ పరిస్థితి క్షణక్షణానికి దిగజారుతోంది. ఊపిరి మందగిస్తోంది. శ్వాస కష్టమవుతోంది.
    బాధాతప్త హృదయంతో, తన ఏకైక సంతానం కొన ఊపిరితో పెనుగులాడ డాన్ని ఆమె నిస్సహాయంగా చూడసాగారు. ఎండిపోయిన బిడ్డ గొంతు నుంచి ఎలాంటి ధ్వని రావడం లేదు. కేవలం కాళ్ళు కొట్టు కుంటున్న శబ్దం మాత్రం వినిపిస్తోంది. పసిబిడ్డ ఇస్మాయీల్‌ తన చిన్నారి కాళ్ళతో నేలను కొడుతున్న ప్రదేశంలో స్వచ్ఛమైన నీటి ఊట అకస్మాత్తుగా ఉబికి వచ్చింది. ఆమె తన కళ్ళను తాను నమ్మలేక పోయారు.
    అల్లాహ్‌ా పట్ల ఆమె చూపిన విధేయత, ఆమె ప్రదర్శించిన సహనాలకు అత్యుత్తమ బహుమానం లభించింది. ఎండిపోయిన నేల నుంచి స్వచ్ఛమైన జలధార ఉబికి వచ్చేలా చేశాడాయన. తనకు నమ్మకస్తుడైన స్నేహితుడు ఇబ్రాహీమ్‌ (అ) కుటుంబం కష్టాల నుంచి బయటపడే దారి చూపిం చాడు. హాజిరా ఆ స్వచ్ఛమైన నీటిని బిడ్డ నోటిలో పోశారు. ఆ నీటతో బిడ్డ ప్రాణాలు కుదుట పడటాన్ని ఆమె ఆనందంగా వీక్షించారు. కన్నీళ్ళతో ఆమె అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పించారు. ఆ అద్భుతమైన జలధారలే ”జమ్‌ జమ్‌” జలంగా ప్రసిద్ధికెక్కాయి. 4000 సంవత్స రాల క్రితం నాటి ఈ జలధార నేటికి కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. లక్షలాది హజ్‌ యాత్రీకులకు అత్యంత ఆరోగ్యప్రదమైన నీటిని అందిస్తోంది. ఒకప్పుడు నిర్జనమైన ఆ ప్రదేశంలో జీవం తొణికిసలాడేలా చేసింది ఈ జమ్‌జమ్‌ జలమే.
    మరిన్ని చిహ్నాలు
    దూరదూర ప్రాంతాలకు చెందిన పక్షులు ఆ నీటిని చూసి దాహం తీర్చుకోవడానికి అక్కడ వాలడం ప్రారంభించాయి. యెమన్‌ నుంచి వస్తున్న ఒక అరబ్బు తెగ ”జుర్‌హుమ్‌” (యెమన్‌ వాసులు నిజమైన అరబ్బులు అనబడుతారు. వారు మాట్లాడే అరబీ భాష చాలా ప్రామాణికమైనది.) దూరం నుంచి పక్షులు గుంపులుగా ఆ ప్రదేశం వైపునకు వెళ్ళడాన్ని గమనిం చారు. విచారించడానికి కొందరిని అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళిన వారు అక్కడ నీటి వనరు ఉందని తెలిపారు. ఆ అరబ్బు తెగ ఆ ప్రదేశానికి వచ్చింది. ఆ నిర్జన ప్రదేశంలో మనుష్యుల్ని చూసి హాజిరా చాలా సంతో షించారు. తనకు, తన కుమారునికి అల్లాహ్‌ పరిరక్షణ లభించిందనడానికి సూచనగా ఆమె భావించారు. ఆ ప్రజల హృదయాల్లో అల్లాహ్‌ వారి పట్ల సాను భూతిని జనింపజేశాడు. ఆ ప్రదేశం వైపునకు వారు వచ్చేలా చేశాడు. ఆ విధంగా ఇబ్రాహీమ్‌ (అ) చేసిన ప్రార్థన ను దేవుడు ఆమోదించాడు.
    ఆ ప్రదేశంలో జమ్‌జమ్‌ నీటి ఊట బయటపడినందువల్ల యెమన్‌ నుంచి అక్కడకు వచ్చిన జుర్‌హుమ్‌ తెగ అక్కడ విడిది చేయడానికి, ఆ నీటిని వాడుకోవ డానికి హాజిరా అనుమతి కోరారు. హాజిరా సంతోషంగా వారిని స్వాగతిం చారు. వారిని అతిథులుగా గౌరవిం చారు. వారిలో కొందరు తమ కుటుం బాలను అక్కడకు పిలిపించుకున్నారు. చాలా మంది ఆ ప్రదేశం (మక్కా)నే తమ శాశ్వత నివాసంగా మార్చుకున్నారు.
    ఇబ్రాహీమ్‌ (అ) అభిలాష
    నిర్మానుష్య ప్రదేశంలో తాను వదలి వచ్చిన తన భార్యాబిడ్డల గురించి ఇబ్రాహీమ్‌ (అ) ఎప్పుడూ చింతిస్తూ ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి వారిని చూసి వచ్చేవారు. తాను కోరిన విధంగా తన కుమారుడు పెద్ద వాడవ్వడాన్ని చూసి సంతృప్తి చెందేవారు. తన కుటుంబాన్ని ఆదుకున్న విశ్వప్రభువుకు కృతజ్ఞతలు అర్పించే వారు. తన కుటుంబానికి నిలువ నీడ కల్పించి, వారికి కావలసిన అన్నపానీ యాలు ఏర్పాటు చేసిన అల్లాహ్‌కు ధన్య వాదాలు తెలుపుకునేవారు.
    నిరుపమానమైన త్యాగం
    ఇబ్రాహీమ్‌ (అ) జీవితం యావత్తు విశ్వప్రభువు పట్ల నిబద్ధతను, చెక్కు చెదరని విశ్వాసాన్ని ప్రకటించే పరీక్షల సంగమం. దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నవారు ఎన్నడూ నిరాశ చెందరు. అల్లాహ్‌ ఆదేశాలను ఎన్నడూ ప్రశ్నిం చరు. అల్లాహ్‌ ఎల్లప్పుడూ చెడుపై మంచికి విజయాన్ని ప్రసాదిస్తాడని ప్రగా ఢంగా విశ్వసిస్తారు. ఇస్మాయీల్‌ (అ) చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు అల్లాహ్‌ మరోసారి ఇబ్రాహీమ్‌ (అ)ను కఠినమైన పరీక్షకు గురి చేశాడు. ఒక కల ద్వారా ఇబ్రాహీమ్‌ (అ) తన ఏకైక కుమారుణ్ణి అల్లాహ్‌ కోసం జిబహ్‌ చేయాలని ఆదేశించడం జరిగింది.
    (బైబిల్‌లో కూడా ఈ ప్రస్తావన ఉమది. అబ్రహంకు అతని ఏకైక పుత్రుడు, ఇస్సాక్‌ను బలి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందని. కాని ఇస్సాక్‌ ఆయన ప్రథమ పుత్రుడు కాదు. ఇస్మాయీల్‌ (అ) ఆయన జేష్ఠ పుత్రుడు. అంటే ఈ ఆదేశం అందిన సమయంలో ఆయనకు ఉన్న ఏకైక పుత్రుడు ఇస్మాయీల్‌ (అ) మాత్రమే. ఇస్సాక్‌ ఆ తర్వాత చాలా సంవత్సరాలకు జన్మించారు. ఇస్మాయీల్‌ (ఆ అరబ్బు తెగల్లో కలిశారు. ఆయన సంతానంలో ప్రవక్త అరబీ (స) జన్మించారు. కాగా ఇస్సాక్‌ సంతానంలో ఇతర ప్రవక్తలు జన్మించారు. అందువల్లనే అరబ్బులు, ఇస్రాయీల్‌ (ప్రవక్త యాకూబ్‌ (అ)గారి) సంతానం సోదరులని చెప్పడం జరుగు తుంది.)
    ఆత్మ విశ్వాసంతో ఇబ్రాహీమ్‌ (అ) మక్కాకు బయలు దేరారు. ఈ వార్తను తన కుమారునికి చెప్పడం ఆయనకు ఒక పరీక్ష వంటిదే. అయితే ఇస్మాయీల్‌ (అ) కూడా తండ్రికి తగిన కుమారులు. ఆయన అనితర సాధ్యమైన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. దేవుని ఆదేశాన్ని అమలు చేయాలని ఆయన నిబ్బరంగా తన తండ్రికి చెప్పారు. ”నాన్నా! మీకు ఆజ్ఞా పించబడినట్లు చేెయండి. అల్లాహ్‌ా కోరిన విధంగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని బదులిచ్చారు. ఆయన తన దుస్తులు తొలగించారు. తల్లికి సలాము చెప్పాలని తండ్రిని కోరారు. తన గుర్తులుగా తన దుస్తులు తల్లికివ్వాలని చెప్పారు. తాను కాళ్ళు చేతులు కొట్టు కోవడం జరిగితే తన తండ్రికి బాధ కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తన కాళ్ళను చేతులను కట్టేయాలని తండ్రిని కోరారు. ఇబ్రాహీమ్‌ (అ) తన కత్తికి పదును పెట్టారు. ఆ విధంగా ఇస్మాయీల్‌ (అ)కు మృత్యు బాధ లేకుండా ఉండాలని భావిం చారు.
    కుమారుడిని గట్టిగా కౌగలించుకుని రోదించారు. తర్వాత ఇస్మాయీల్‌ (అ)ను పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. బాధాతప్త హృదయంతో కుమారుణ్ణి చివరిసారిగా చూసుకున్నారు. బరువెక్కిన హృదయంతో కత్తిని ఎత్తారు. ఇస్మాయీల్‌ (అ) గొంతుపై వేటు వేశారు. కాని ఆ కత్తి గొంతును కోయలేదు. తన తండ్రి తగినంత గట్టిగా కోయాలని తండ్రితో చెప్పారు. ఇబ్రాహీమ్‌ (అ)అలాగే చేశారు. అయినా ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) ఆశ్చర్యపోయారు. తన బలహీనతను క్షమించవలసినదిగా ఆయన అల్లాహ్‌ాను వేడుకున్నారు. అల్లాహ్‌ా ఆయన వేడుకోలుకు బదులిచ్చాడు. ”ఇబ్రాహీమ్‌ (అ)! నీవు నిజంగా కలను సార్థకం చేశావు. మేము నీ విధేయతకు బహు మానం ప్రసాదిస్తున్నాము” అన్నాడు. ఆ తండ్రీకొడుకులు దేవుని ఆదేశం శిరసా వహిండానికి క్షణం వెనుకాడలేదు. అల్లాహ్‌ాకు కావలసింది బలి కాదు. తన ఆదేశాల పట్ల వారు చూపిన నిబద్ధతనే ఆయన పరీక్షించాడు. తండ్రీ కొడుకులు దేవుని కారుణ్యం పట్ల కృతజ్ఞతలు అర్పిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు బదులుగా జిబహ్‌ా చెయ్యడానికి ఆ దగ్గరలోనే ఒక పెద్ద పొట్టేలు కనబడింది. అంతకు ముందు కోయడానికి మొండికేసిన కత్తి ఆ పొట్టేలు గొంతును ఒక్క వేటుకు కోసింది. ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈదుల్‌ అజ్హా (ఖుర్బానీ పండుగ) సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం జరుగుతుంది.
    ద్వార బంధాన్ని మార్చడం
    ఇస్మాయీల్‌ (అ) ఒక అందమైన యువకునిగా ఎదిగారు. జుర్‌హుమ్‌ తెగవారి వద్ద ఆయన అరబీ భాషను నేర్చు కున్నారు. ఈ తెగకు చెందిన అమ్మాయినే వివాహమాడారు. ఆయన చాలా బినందంగా జీవితాన్ని గడుపసాగారు. ఆయన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క దుఃఖకరమైన సంఘటన ఆయనను అమితంగా ప్రేమించిన మాతృమూర్తి తనువు చాలించడం. ఇస్మాయీల్‌ (అ)ను కంటికి రెప్పలా సాకిన హాజిరా మరణిం చిన సంఘటన ఆయన్ను విపరీతంగా కలచి వేసింది.
    ఇబ్రాహీమ్‌ (అ) అప్పుడప్పుడు వచ్చి కుమారుణ్ణి చూసి వెళ్ళేవారు. ఆ ఎడారిలో ఆయన కుమారుణ్ణి చూడడానికి అనేక రోజులు ప్రయాణం చేసి రావలసి వచ్చేది. ఒకసారి ఆయన వచ్చినప్పుడు ఇస్మాయీల్‌ (అ) ఇంట లేరు. ఆయన భార్య ఇంట ఉండటంతో ఆమెతో ఇబ్రాహీమ్‌ (అ) మాట్లాడారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేశారు. అయితే ఆమె ఆయన చెప్పే విషయాలు ఏవీ వినకుండా తన భర్త గురించి ఫిర్యాదులు ప్రారంభించింది. తమ బీద స్థితి గురించి చెప్పుకొచ్చింది. వచ్చింది ఎవరని కూడా ఆమె అడగలేదు. కనీసం మంచి నీరన్నా అందించలేదు. అసహనం నిండిన స్త్రీని ఇబ్రాహీమ్‌ (అ) ఆమెలో చూశారు. అల్లాహ్‌ా అనుగ్రహాలను గుర్తించే శక్తిలేని స్త్రీని చూశారు. ఆయన కనీసం తన ఒంటె నుంచి క్రిందికి కూడా దిగలేదు. ఆయన ఆమెతో, ”నీ భర్తను అడిగానని చెప్పు… ఇంటి ద్వారబంధాన్ని మార్చడం మరచిపోవద్దని చెప్పు” అని వెళ్ళిపోయారు.
    ఇస్మాయీల్‌ (అ) ఇంటికి వచ్చిన తర్వాత ఆమె జరిగింది ఆయనకు చెప్పింది. వచ్చిన వ్యక్తి ఎలాఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె ఆ వ్యక్తి ఆకారాన్ని వర్ణించింది. ఆ వచ్చింది తన తండ్రి అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిన మాటలకు అర్థాన్ని వివరిస్తూ, సరిగా లేని ద్వారబంధం ఇంటికి తగినది కాదనీ, దాని వల్ల మనిషికి ఎదురు దెబ్బలు తగలడమే కాదు, గాయాలు కూడా అవుతాయనీ, అదే విధంగా ఆమె తనకు తగిన భార్య కాదని అన్నారు.
    కొంతకాలం తర్వాత ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ణి చూడటానికి మళ్ళీ వచ్చారు. అప్పుడు కూడా ఆయన కుమారుడు ఇంట లేరు. అయితే ఇంట మరో స్త్రీ ఉంది. ఆమె ఇస్మాయీల్‌ (అ) మళ్ళీ పెళ్ళాడిన స్త్రీ. ఆమె ఆయనకు నీరందించింది. భోజనం వడ్డించింది. ఆయన ఒంటె దిగి, ఆమెను ఆమె భర్త గురించి అడిగారు. తన భర్త వేటకు వెళ్ళారని ఆమె బదులిచ్చింది. ఆ కాలంలో ఎడారి జీవితం చాల కష్టంగా ఉండేది. ఆహారం కోసం వేటాడ్డానికి చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది.
    ఆమె తన భర్త గురించి చెబుతూ ఆయన చాలా కష్టపడి తమను పోషిస్తు న్నారని ప్రశంసలతో ముంచెత్తింది. అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు అర్పిస్తూ మాట్లా డింది. ఇబ్రాహీమ్‌ (అ) చాలా సంతోషిం చారు. ఇస్మాయీల్‌ (అ)కు తగిన భార్య లభించిందని ఆనందించారు. తాను ఎవరైనదీ ఆమెకు చెప్పలేదు. తాను ఒక స్నేహితుడిని అని మాత్రమే చెప్పారు. (ఆమె ఎలాంటి కోడలో తెలుసుకోవాలని ఆయన భావించారు. ఆమె గురించి తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా ఒక సందేశ రూపంలో అందించి ఆమెను ఆశ్చర్య పరచాలని భావించారు.) అక్కడి నుంచి బయలుదేరుతూ ఆయన ఆమె చూపిన అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పారు. ”నీ భర్త వచ్చిన తర్వాత నా సలాము చెప్పు. ఇప్పుడు ద్వారబంధం చక్కగా కుదిరిందని చెప్పు” అని వెళ్ళిపోయారు.
    ఇస్మాయీల్‌ (అ) ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె జరిగింది వివరించారు. వచ్చిన అతిథి ఎలా ఉన్నారని ఇస్మాయీల్‌ (అ) ప్రశ్నించారు. ఆమె వివరించిన తర్వాత ఇస్మాయీల్‌ (అ) నవ్వుతూ, వచ్చినది తన తండ్రి అనీ, ఆయన నిన్ను నాకు తగిన భార్యగా అభివర్ణించారనీ, నీతో కలిసి ఉండాలని, నిన్ను కాపాడాలని కోరారని వివరించారు. ఇస్మాయీల్‌ (అ) జీవితాంతం ఆమెతో కలిసి ఉన్నారు. ఆమె ద్వారా ఆయనకు సజ్జన సంతానం కలిగింది.
    కాబా నిర్మాణం
    ఇబ్రాహీమ్‌ (అ) తన కుమారుణ్ని చూసి చాలా కాలమయ్యింది. ఈసారి ఆయన ఒక అతి ముఖ్యమైన పని చేయవలసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి ఆరాధనాలయాన్ని పునర్నిర్మించ వలసిందిగా అల్లాహ్‌ా ఆయన్ను ఆజ్ఞాపించాడు. మక్కా లోయలో ఈ ఆరాధనాలయం ప్రాచీన కాలంలో ఉండేది. ఇబ్రాహీమ్‌ (అ) మక్కా లోయకు వచ్చారు. అక్కడ జమ్‌జమ్‌ బావి వద్ద తన కుమారుడు ఇస్మాయీల్‌ (అ) బాణాలకు పదును పెడుతుండ టాన్ని చూశారు. తండ్రిని చూసి ఆయన అమితంగా సంతోషిం చారు. తండ్రీకొడుకులు ఆనందంతో కౌగిలించుకున్నారు. అల్లాహ్‌ తనకు కాబా గృహాన్ని నిర్మించమని ఆదేశించాడని ఇబ్రాహీమ్‌ (అ) కుమారునికి తెలియజేశారు. ఇస్మాయీల్‌ (అ) ఎల్లప్పుడూ తన ప్రభువు ఆదేశాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉండేవారు. ఇరువురు కలసి కాబా గృహం పునాదులు తవ్వసాగారు. ఈ పని చేస్తున్నప్పుడు వారి నోట క్రింది పదాలు వారి హృదయాల్లోని భావాలను వ్యక్తం చేస్తూ వెలువడసాగాయి.
    ”ఓ ప్రభూ! మా యిద్దర్ని ముస్లింలుగా జేయి. మా సంతానంలో ముస్లిం జాతిని ఉద్భవింపజేయి. మా ప్రయత్నాల ఫలితాలను మాకు చూపించు. మా పశ్చాత్తాపాన్ని స్వీకరించు. నీవే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడివి. అనంత కరుణామయుడివి”. (బఖరా:127,128)
    ఇస్మాయీల్‌ (అ) రాళ్ళను మోసుకుని వస్తుంటే ఇబ్రాహీమ్‌ (అ) వాటిని అమర్చ సాగారు. కొంతకాలానికే నిర్మాణం రూపు రేఖలు దిద్దుకుంది. తమకు సహాయంగా ఎవరినీ వారు తీసుకోలేదు. గోడలు చాలా ఎత్తుకు లేచాయి. ఇప్పుడు రాళ్ళు పేర్చడానికి ఇబ్రాహీమ్‌ (అ)ఏదైనా ఎత్తు వేసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఆయన ఇస్మాయీల్‌ (అ)తో ఏదైనా మంచి రాయి, తాను నిలబడటానికి చూడమని చెప్పారు. ఇస్మాయీల్‌ (అ) ఒక పెద్ద రాయిని అక్కడికి దొర్లించారు. (ఈ రాయి వేలాది సంవత్స రాలుగా పరిరక్షించబడుతున్నది. నేడు ‘మఖామె ఇబ్రాహీమ్‌’ అన్న పేరుతో గాజు పలకల మధ్య ఉన్న రాయి ఇదే.) ఆ విధంగా కాబా గృహం నిర్మించబడింది. మక్కాలో కాబా గృహం నిర్మించ బడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్త ముస్లింలకు (దైవ విధేయులకు) పవిత్ర గృహంగా అలరారుతోంది. విశ్వప్రభువైన అల్లాహ్‌ పట్ల తమ కృతజ్ఞతలను ముస్లింలు ఇక్కడికొచ్చి తెలియజేస్తుంటారు.
    గ్రహించవలసిన పాఠాలు
    ఇబ్రాహీమ్‌ (అ)ను ప్రవక్తల పితామహునిగా పేర్కొనడం జరిగింది. సమాజంలో షిర్క్‌ (బహుదైవారాధన)ను దురాచా రాలను తుదముట్టించడానికి ఆయన నిరంతరం శ్రమించారు.
    ఇబ్రాహీమ్‌ (అ) తండ్రి అల్లాహ్‌ సందేశాన్ని తిరస్కరించి నప్పుడు ఆయన తన తండ్రిని నిందించలేదు. ఆయన సాఫల్యం కొరకు ప్రార్థించారు. ఆయనను సత్యసందేశం స్వీకరించేలా మార్చాలని ఆశించారు. తండ్రి పట్ల ఆయన గౌరవాదరణలతో వ్యవహరించారు. ఆయన పట్ల గౌరవమర్యాదల్లో లోటు చేయలేదు. ఇబ్రాహీమ్‌ (అ) అల్లాహ్‌ పట్ల పూర్తి విశ్వాసం కలిగి నవారు. ఎలాంటి త్యాగానికైనా వెనుదీయని వ్యక్తిత్వం ఆయనది. విశ్వప్రభువైన అల్లాహ్‌ ఆయన్ను ”ఖలీలుల్లాహ్‌” (అల్లాహ్‌ మిత్రుడు)గా అభివర్ణించాడు.
    విగ్రహారాధకులను ఎదుర్కొన్నప్పుడు ఆయన అనితర సాధ్యమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారు అత్యంత పవిత్రంగా భావిస్తున్న అంశాల్లోని ఔచిత్యాన్ని నిర్భయంగా ప్రశ్నించారు. మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం లేెనప్పుడు ఆయన తన నిరసనను చేతల్లో చూపించారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. అందువల్ల ఆయన్ను అగ్ని గుండంలోకి విసిరివేయడం జరిగింది. కాని అల్లాహ్‌ా పట్ల ఆయనకున్న చెక్కుచెదరని విశ్వాసం ఆయన్ను కాపాడింది.
    ఆయన భార్యలు సారా, హాజిరా ఇద్దరూ సౌశీల్యవతులు, ఆయన పట్ల పూర్తి విధేయత కలిగినవారు. సహనంతో వ్యవహరిస్తూ గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. అందుగ్గాను అల్లాహ్‌ వారికి అనేక విధాల బహూకరించాడు.
    హాజిరా పట్ల, హాజిరా కుమారుని పట్ల ఇబ్రాహీమ్‌ (అ) గారి శ్రద్ధ చూసి సారా అసూయపడటం మానవ సహజమైన ప్రతిక్రియగా అర్థం చేసుకోవాలి.
    ఇబ్రాహీమ్‌ (అ) కుమారుడు ఇస్మాయీల్‌ (అ) తండ్రికి తగిన తనయుడు. తనకు తాను ప్రాణ త్యాగానికి సిద్ధమై అల్లాహ్‌ సంతుష్టిని పొందారాయన.
    అల్లాహ్‌కు మానవ బలి అవసరం లేదు. అల్లాహ్‌ కోసం కన్నకొడుకును జిబహ్‌ చేయడానికి సిద్ధపడడాన్ని, అల్లాహ్‌ సేవ కోసం కన్న కుమారుడిని అంకితం చేయడంగా మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలం.
    వారు నిర్మించిన కాబా గృహం దేవుని ఏకత్వానికి చిహ్నంగా గత 4000 ఏళ్ళ సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తోంది.

    హజ్


    లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లాషరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ ద, వన్నామత, లకవల్ ముల్క్, లాషరీక లక్ – హాజరయ్యాను ప్రభూ హాజరయ్యాను. హాజరయ్యాను. నీకెవ్వరూ భాగస్వాములు లేరు. నిశ్చయంగా సకల ప్రశంసలు, సర్వానుగ్రహాలు, సర్వాధికారాలు నీవే. నీకెవ్వరూ భాగస్వాములు లేరు.


       

      మహారాధన మహోపదేశం


      అవని పొత్తిళ్లలో ప్రాణం పోసుకునే అంకురాలు, పృధ్వి ప్రాంగణంలో మొగ్గలు తొడిగే రెమ్మలు, వసుంధర ఒడిలో వికసించే పూలు, క్షోణి శిక్షణలో ఎదిగే సస్యశ్యామల వృక్షాల తోరణాలు, పుడమి లోని అరణ్యాలు, ధరణిలోని ఇరులు-ఝరులు, నేలలోని పర్వతాలు-సముద్రాలు, నింగిలోని తార కలు, సూర్యచంద్రాదులు – ఒకటేమిటి అన్నింటా ప్రతిధ్వనిస్తున్నాయి ఆ పవిత్ర ధుని ధ్వనులు – ‘లబ్బయిక్‌ అల్లాహుమ్మ లబ్బయిక్‌, లబ్బయిక లా షరీక లక లబ్బయిక్‌..’ భూమిలో అణువణువు పులికిస్తోంది పరవశించి. అండ, పిండ, బ్రహ్మాండాల్లో దర్శనమిచ్చే ఆ ఘనాఘనుడి ప్రతిభకు ‘స్తోత్రం, ప్రశంసలు నీకే చెల్లు’ అంటూ కొనయాడుతున్నాయి తన్మయం చెంది. ‘సార్వభౌమత్వం నీదే’ అంటూ ఆ కరుణానిధిని ఘనంగా కీర్తిస్తున్నాయి తాదాత్మ్యానికి లోనయి. నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ధుని ఒకే మానవ మాత్రుడు, ప్రవక్తల పితామహుని నోట ప్రతిధ్వనిం చింది. మరి నేడు: కొన్ని వేల సంవత్సరాల అనంతరం అనవతరంగా ధరణి దశ దిశల నుండి విన్పిస్తున్నాయి ఆ పవిత్ర ధుని ధ్వనులు.
      ఇస్లామీయ జీవన వ్యవస్థకు సంబంధించిన సుందర, సుమనోహరమైన రాజప్రసారపు అయిదు మూల స్థంభాలలోని ఓ మూల స్థంభం హజ్‌. ఈ మాహారాధన మాధ్యమంతో ఇస్లామీయ జీవన సౌధానికి మనిషి ఆంతర్యంలో పునాదులు పడకపోతే కేవలం హజ్‌ చేయడం వల్ల ఎలాంటి ప్రయో జనం ఉండదు. స్థానికంగా మనిషి నమాజు ద్వారా అశ్లీల చేష్టలకు, అసభ్య ప్రవర్తనలకు, మితి మీరిన పోకడలకు దూరంగా ఉండి, జకాతు ద్వారా వ్యాపార లావాదేవీలు, ఉద్యోగ వ్యవహారాలు, రాజకీయ, ఆర్థిక వ్వయహారాలలో ఉన్న ధన తృష్ణ, స్వార్థం, మోసం, దురాశ మొదలయిన చీడలకు దూరంగా మసలుకుంటూ, ఉపవాసం ద్వారా ఆలోచనల్లో, అణువణువులో దైవభీతిని, నైతిక రీతిని నింపుకుని ఈ మహారాధన కోసం బయలుదేరుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐహికంగా మనిషి మినీ ప్రస్థానాలను దాటుకుంటూ ఈ మహా ప్రస్థానం దిశగా అడుగులు వేస్తాడన్న మాట. ఇక్కడ దైవం, దైవప్రవక్త విధేయతే పరమావధి. ఓ అనీర్వచనీయమయిన అనుభూతికి, ఓ అద్వితీ యమయిన భక్తిభావానికి, తన్మయానికి, తాదాత్మ్యానికి లోనవుతాడు. ఈ హజ్‌ మాహారాధన – దైవం జారీ చేసిన ప్రతి ఫర్మానాను ఎటువంటి తడబాటుకు, తత్తరపాటుకు లోనవకుండా తక్షణమే శిరసా వహించేలా శిక్షణ ఇస్తుంది. ఆజ్ఞాపించడమే తరువు ప్రాణాల్నయినా తృణప్రాయంగా త్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యేటటువంటి మహా శిక్షణ ఇస్తుంది హజ్‌.
      ఈ మహారాధన కోసం వచ్చిన సుజనుల అణువణువునా భక్తిపారవశ్యాలు తొణికిసలాడుతుం టాయి. స్వేచ్ఛా జీవిగా వారు జన్మించినా, ఆ స్వేచ్చాధికారాలను తమకు ప్రసాదించిన ఆ సర్వాధి కారి సమక్షంలో మాత్రం వారు దాసులుగా, గులాములుగా ఉండేందుకే ఇష్ట పడతారు. ఇక్కడ వారి ఇష్టమంటూ, అభిమతమంటూ, అభిప్రాయమంటూ ఏదీ ఉండదు; ఒక్క దైవాభిమతం, దైవా భీష్టం తప్ప. ప్రాంతీయ దుస్తులు తొలగించి కఫన్‌ వంటి రెండు తెల్లటి దుప్పట్లు చుట్టుకోమన్నా, ప్రాంతీయ భాషను విడనాడి ‘తల్బియా’ పలుకులు ఉచ్చరించమన్నా, ఇహ్రామ్‌ స్థితిలో సువాసన పూసుకోకు, వెంట్రుకలు సవరించుకోకు, ఎటువంటి సింగార చర్యల జోలికి పోకు, వేటాడకు అన్నా విన్న ప్రతి మాటను మరోమాట మాట్లాడకుండా బుద్ధిగా, నిండు భక్తితో పాటిస్తారు. ఇదే భక్తి ప్రపత్తులతో కాబా ప్రదక్షిణ, సఫామర్వాల మధ్య సయీ చేస్తారు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా పెంచుకున్న తలవెంట్రుకలను క్షవరం చేస్తూ, తల అడిగినా తృణప్రాయంగా ఇచ్చేస్తానంటూ తల వంచి మరి చాటుతారు. ఊరి బైట మినా,ముజ్దలిఫా మైదానాల్లో భూమియే పాన్పుగా, ఆకాశమే కప్పుగా జీవిస్తారు. జమరాత్‌లపై కంకర్రాళ్లు రువ్వడం మొదలు ఖుర్బానీ, తవాప్‌ ఇఫాజా, హజ్‌ క్రియలన్నీ పూర్తయ్యే వరకూ ప్రతి ఒక్క ఆదేశాన్ని ఆదాబులతో సహా చక్కగా పాటిస్తారు. ఏ ఆజ్ఞ విషయంలోనయినా పొరపాటున తప్పు దొర్లితే దానికి ఫిద్యా – పరిహారం చెల్లిమచాలని మరో ఆజ్ఞ ఆవుతుంది. దానికీ సహృదయంతో సిద్ధమవుతారు. ఈ మహారాధన క్రియల్ని నిర్వర్తించడంలో ఎదురయ్యే కష్టాలను, బాధలను, అవాంతర స్థితులను ఎంతో ఓపిగ్గా సంతోషంగా సహిస్తారు. ఆ విధంగా ఈ స్వల్ప కాలిక ఆరాధన ద్వారా వారికి శాశ్వతమయిన శిక్షణ ఇవ్వాలన్నదే అల్లాహ్‌ా అభిమతం. ఈ కారణంగానే ”స్వీకృతి పొందిన హజ్‌ ప్రతిఫలం ఒక్క స్వర్గం తప్ప మరేమి కాజా లదు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). అంటే ఈ మహాప్రస్థానం మరికొన్ని ప్రస్థానాలకు స్ఫూర్తి అవ్వాలి. అలా జీవించాలని ప్రయత్నిస్తూ మరణించినవారే సఫలీకృతులు! సర్వేజనా సృజనో భవంతు! సర్వే సుజనా సుఖినోభవంతు! అని కోరుతూ పాఠక మహాశయులందరికీ ఖుర్బానీ పండుగ శుభాకాంక్షలు!!

      మస్జిదె నబవీని సందర్శించని హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గా మిగిలిపోతుందా?


      ప్రశ్న: మస్జిదె నబవీ (ప్రవక్త మస్జిదు)ని సందర్శించనంతవరకు తమ హజ్జ్‌ నాసిరకపు హజ్జ్‌గానే పరిగణించబడుతుందని కొంత మంది హాజీలు భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం?
      జవాబు: మస్జిదె నబవీ సందర్శన (జియారత్‌) సున్నత్‌, వాజిబ్‌ (తప్పనిసరి) కాదు. హజ్జ్‌ యాత్రలో, హజ్జ్‌ క్రియలలో ఇది అంతర్భాగం కూడా కాదు. కాకపోతే ప్రవక్త మస్జిదును సందర్శించటం అభిలషణీయం. ఏటేటా ఈ మస్జిద్‌ను దర్శించటం సున్నత్‌. అంతేగాని ఈ విషయాన్ని హజ్జ్‌ క్రియల (మనాసికె హజ్జ్‌)తో ముడిపెట్ట కూడదు. ఎందుకంటే ప్రవక్త మహనీయులు (స) ఇలా ప్రవచించారు:
      ”మూడు మస్జిద్‌లు తప్ప మరే స్థలానికీ ”పుణ్యార్జన” (సందర్శన, మహత్మ్యం) ఉద్దేశ్యంతో ప్రయాణమవకూడదు – 1) మస్జిదె హరామ్‌ వైపునకు, 2) నా ఈ మస్జిద్‌ వైపునకు, 3) మస్జిదె అక్సా వైపునకు”. (ముత్తఫఖున్‌ అలైహి)
      ఆయన (స) ఇంకా ఇలా అన్నారు: ”నా ఈ మస్జిద్‌లో చేసే ఒక నమాజ్‌ – మస్జిదె హరామ్‌ మినహా – వేరితరచోట్ల చేసే వేయి నమాజులకన్నా శ్రేష్ఠమైనది”. (ముత్తఫఖున్‌ అలైహి)
      ఇకపోతే, ప్రవక్త మస్జిదును సమదర్శించినవారు మస్జిదులోని ‘రియాజుల్‌ జన్నహ్‌ా’ అనే స్థలంలో రెండు రకాతుల నఫిల్‌ నమాజు చేయటం నియమం. ఆ తరువాత దైవప్రవక్త (స)పై, ఆయన ప్రియ సహచరులైన అబూ బక్ర్‌, ఉమర్‌ (ర అన్‌హుమ్‌)లపై సలాం పఠించాలి. జన్నతుల్‌ బఖీని సందర్శించి, అక్కడ ఖననమై ఉన్న మహనీయులకు, తదితరులకు సలాం పంపినట్లే ఇది కూడా. ప్రవక్త మహనీయులు (స) సయితం సమాధులను సందర్శించినప్పుడు దుఆ చేసేవారు, ఈ విధంగా చేయమని తన సహవాసులకు నేర్పారాయన (స).
      ”అస్సలాము అలైకుమ్‌ అహ్లద్దియారి మినల్‌ మోమినీన్‌ వల్‌ ముస్లిమీన్‌ – వ ఇన్నా ఇన్షాఅల్లాహు బికుమ్‌ లాహిఖూన్‌ – నస్‌అలుల్లాహ లనా వలకుముల్‌ ఆఫియహ్‌”.
      (విశ్వాసుల, ముస్లింలకు చెందిన పరివార సదస్సులారా! మీకు శాంతి కలుగుగాక! దైవ చిత్తమైతే మేము కూడా మిమ్మల్ని కలుసుకుంటాము. మేము మా కోసం, మీ కోసం కూడా అల్లాహ్‌ా నుండి క్షేమాన్ని అర్థిస్తున్నాము)
      మస్జిదె నబవీని సందర్శించిన వారు మస్జిదె ఖుబాను కూడా దర్శించి, అక్కడ కూడా రెండు రకతుల నమాజు చేయటం నియమం. ఎందుకంటే దైవప్రవక్త (స) సాధారణంగా ప్రతి
      శనివారంనాడు మస్జిదె ఖుబాకు వెళ్ళి, రెండు రకాతుల నమాజు సలిపేవారు. ఆయన (స) ఇంకా ఇలా వక్కాణించారు: ”ఎవరయినా తన ఇంట్లో చక్కగా తహారత్‌ చేసి, ఈ మస్జిద్‌ (మస్జిదె ఖుబా)కు వచ్చి అందులో రెండు రకాతులు నమాజ్‌ చేస్తే అది ఒక విధంగా ఉమ్రా (చేయటం) వంటిదేె”.
      మదీనాలో సందర్శించవలసిన స్థలాలివే. మరికొన్ని స్థలాలను – ఉదాహరణకు:- ఏడు మస్జిద్‌లు, మస్జిదె ఖిబ్లతైన్‌, ఇంకా ఇలాంటి మరికొన్ని స్థలాల గురించి కూడా కొంత మంది రచయితలు పేర్కొంటూ, వాటిని ముఖ్యమైన క్రియలలో భాగంగా నొక్కి చెబుతుంటారు కాని దానికి మూలాలేమీ లేవు. విశ్వాసి అయినవాడు బిద్‌అత్‌ వాసన వచ్చే ప్రతి దానినీ వదలి పెట్టి సున్నత్‌ (పవక్త విధానము)ను అనుసరించాలి… సద్బుద్ధినిచ్చేవాడు అల్లాహ్‌ా మాత్రమే.
      తల్లిదండ్రుల తరఫున హజ్జ్‌ చేయాలని ఉంది
      ప్రశ్న: నా పసితనంలోనే అమ్మ పోయింది. నేను ఒక వ్యక్తికి హజ్‌ ఖర్చులిచ్చి నా తల్లి తరఫున హజ్‌ చేయించాను. తరువాత నా తండ్రి కూడా మరణించారు. ఇప్పుడు నేను వారిద్దరి తరఫున హజ్‌ చేయటమో లేక ఎవరినయినా ఈ విధి నిర్వహణ కోసం నియమించటమో చేయాలనుకుంటున్నాను. ఈ రెండింటిలో ఏది సరైనది?
      జవాబు: ఒకవేళ మీరే మీ తల్లిదండ్రుల తరఫున హజ్జ్‌ చేసి, హజ్‌ క్రియలను, ఆదేశాలను సజావుగా నెరవేర్చగలిగినట్లయితే – ఇదే మీ కొరకు ఉత్తమం. ఒకవేళ ధర్మావగాహన ఉన్న విశ్వసనీయత గల వ్యక్తిని ఈ విధి నిర్వహణ కోసం పంపినా ఫరవాలేదు. కాని మీరు మీ తల్లిదండ్రుల తరఫున ఈ కర్తవ్యాన్ని నెరవేర్చటమే మంచిది. కారణాంతరాలవల్ల ఇది సాధ్యం కాకపోతే ఈ పని కోసం ఎవరినయినా మీ తరఫున నియమించి, ఇది మీ తల్లిదండ్రుల తరఫున నెరవేరుస్తున్న హజ్‌ విధి అని అతనికి స్పష్టపరచాలి. ఇది మీ తరఫున వారికి జరిగే మేలు అని కూడా విడమరచి చెప్పాలి. అల్లాహ్‌ా ఆమోదించుగాక!